వైసీపీ ఎంపీ, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై ఘాటు విమర్శలు చేశారు. అతని గురించి అతనికే తెలియని నిజాలను విజయసాయి రెడ్డి అయన ట్విట్లతో తెలియజేశారు. ఎప్పుడు ట్విట్టర్ లో ఏదొక విషయంపై ట్విట్ చేసే విజయసాయి రెడ్డి నిన్న సుజనా చౌదరి మాట్లాడినా సంచలన వ్యాక్యలపై మండిపడ్డారు. రాజధానిలో రియల్ ఎస్టేట్ తప్ప ఇంకే సమస్యలు కనిపించడం లేదా మీకు? సుజనా చౌదరి అంటూ ధ్వజమెత్తారు. 


విజయ సాయి రెడ్డి ట్విట్ చేస్తూ 'రాజధాని ప్రాంతం వరదలో మునిగినప్పటి నుంచి అక్కడ భూములు కొన్నవారంతా బట్టలు చించుకుంటున్నారు. రాజధాని తరలిపోతే కోట్ల పెట్టుబడులు ఏమైపోతాయని పీడ కలలు కంటున్నారు. చంద్రబాబు గారేమో హైదరాబాదులో ధరలు పెరుగుతున్నాయని అంటారు. రియల్ ఎస్టేట్ తప్ప ఇంకే సమస్యలు కనిపించడం లేదా మీకు? సుజనా చౌదరి.'  అంటూ ట్విట్ చేశారు. 


ఈ ట్విట్ చుసిన నెటిజన్లు స్పందిస్తూ 'సార్ కట్టింది తాత్కాలిక భవనం కాబట్టి సరిపోయింది. భవిష్యత్ లో భారీవర్షాలు పడితే జగన్ అన్న ఇంటిదగ్గర అసెంబ్లీ సమావేశాలు చేయాల్సిన పరిస్తితి వస్తుంది.! నేషనల్ మీడియా కూడా అలాంటి జాగాలో ఎలా అసెంబ్లీ కట్టారు, బాబుగారు తప్పుచేస్తే మీరు ఎందుకు సరిచేయలేదు అని మనల్నే ప్రశ్నిస్తారు.!' అంటూ ట్విట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.  


మరింత సమాచారం తెలుసుకోండి: