వైసీపీ ఎంపీ, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై మండిపడుతున్నారు. సుజనా చౌదరి రాజధాని విషయంపై నిన్న మాట్లాడిన మాటలపై విమర్శలు భారీగా వచ్చాయి. బీజేపీ ప్రభుత్వం అయినా తెలుగుదేశం బుద్ధులు పోలేదు నీకు అంటూ విజయసాయి రెడ్డి నిన్నటి నుంచి విరుచుకు పడుతూనే ఉన్నారు. కొన్ని కొన్ని ట్విట్లలో సుజనా చౌదరిపై వ్యంగ్యాస్త్రాలు కూడా కురిపించారు.  


పార్టీకి టోపీ పెట్టి మళ్ళి ఆ పార్టీ కోసం మాట్లాడే నువ్వు అని, సుజనా చౌదరి పార్టీ మారినా గుండెల్లో ఇంకా చంద్రబాబు నాయుడే ఉన్నాడు అని ఒక కామెంట్ ఇలా ట్విట్ చేస్తూనే ఉన్నాడు విజయసాయి రెడ్డి. అయితే ఈరోజు తాజాగా విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ 'సుజనా .. భూ ఖజానా' అంటూ సాక్షిలో ఒచ్చిన ఆర్టికల్ క్లిప్ ని జత చేస్తూ ట్విట్ చేశాడు. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.  


ఈ ట్విట్ పై నెటిజన్లు స్పందిస్తూ 'సార్.. సుజనా గారు అనవసరంగా వైసీపీ మీద బురదజల్లే విధంగా మాట్లాడి తప్పుచేసారు! టీడీపీ ప్రభుత్వంలో భూములు కొన్న డాక్యుమెంట్స్ పెట్టుకొని ఎలా విమర్శ చేస్తారు. మోడీజీ కొత్తగా పార్టీలో చేరిన వారు టీడీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతారు నీలా కాదు! లాజిక్ మిస్ అయ్యావ్ సుజనా. ఇలా చేస్తే ఇక మీకే నష్టం.' అంటూ ట్విట్ చేస్తున్నారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: