గంటా శ్రీనివాస్ ఇన్ని రోజులు చాలా సైలెంట్ గా ఉన్నాడు. మొదటి సారిగా గంటా నోరు తెరిసి విశాఖను ఆర్ధిక రాజధానిగా ప్రకటించాలని ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. మరీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గంటా ఇటువంటి డిమాండ్ ఎందుకు చేయలేదో .. ప్రతి పక్షంలోకి వస్తానే ఏదో పెద్ద రాష్ట్రాన్ని ఉద్దరించడానికి మేమున్నామని బిల్డప్ ఇస్తున్నారు. అధికారంలో ఉంటే ఒక మాట ప్రతి పక్షంలోకి వెళితే ఇంకొక మాట మాట్లాడే నేతలను ప్రజలు ఎప్పుడు గమనిస్తుంటారు. అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పని చేసిన గంటా శ్రీనివాస్ అప్పట్లో విశాఖ లో పెద్ద భూ కుంభకోణంలో గంటా హ్యాండ్ ఉన్నట్లు ఏకంగా టీడీపీ నేత ఆరోపించిన పరిస్థితి.


అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో వాటిని మళ్ళీ తోడి గంటాను జైలుకు పంపించే కార్యక్రమం మొదలయినట్టు తెలుస్తుంది. గంటా శ్రీనివాస్ కొన్ని రోజుల నుంచి సైలెంట్ గా ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ మీద విమర్శలతో రెచ్చిపోయేవారు. కానీ ఇప్పుడెందుకో గంటా మోగడం లేదు. అసెంబ్లీలో కూడా గంటా నోరు తెరిచి మాట్లాడటం లేదు. అధికారంలో ఉన్న వైసీపీ ఎక్కడ తన మీద పగబట్టి కేసుల్లో ఇరికిస్తుందేమో నని గంటా భయపడుతున్నంటున్నారు. అందుకే ఎక్కడ సడి చప్పుడు లేకుండా తన పని తాను చూసుకుంటున్నాడు. 


గంటా శ్రీనివాస్ ప్రతి సారి ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి మారేది .. ఆ పార్టీలో పదవులు అనుభవించడం గంటా శ్రీనివాస్ కు అలవాటు. అధికార పార్టీలో లేకపోతే గంటా రాజకీయాలు చేయలేనతంగా బలహీనంగా మారిపోతారు. గంటా టీడీపీ నుంచి ప్రజారాజ్యం లోకి చేరి తరువాత కాంగ్రెస్ పార్టీలోకి చేరి క్యాబినెట్ మంత్రి పదవిని కూడా అనుభవించారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయే లోపలా .. వెంటనే గంటా 2014 లో టీడీపీలో చేరి మళ్ళీ మంత్రి పదవిని దక్కించుకొని పదవులను అనుభవించారు. అయితే 2019 ఎన్నికల్లో పార్టీ మారకుండా టీడీపీ తరుపున పోటీ చేసినా గెలిచారు. విచిత్రం ఏంటంటే గంటా నియోజక వర్గం మారినా .. జగన్ వేవ్ ను తట్టుకొని గెలిచాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: