వైసీపీలో జగన్ కి కుడిభుజం లాంటి వారు విజయసాయిరెడ్డి. ఆయన జగన్ ఇద్దరిదీ రాజకీయ బంధం కంటే గొప్ప బంధం. ఇద్దరూ చాలా ఏళ్ళుగా కలసి ట్రావెల్ చేస్తున్నారు. జగన్ కు విజయసాయి ఆత్మ లాంటి వారు అంటారు. జగన్ మనసులో ఏముందో ఒక్క విజయసాయిరెడ్దికే  తెలుసు అంటారు. జగన్ సీఎం గా విదేశీ టూర్లు చేస్తున్నా కూడా దేశంలో విజయసాయి ఉన్నారన్న ధీమాతోనే ఉంటారని అంటారు. అందుకే పార్టీలో విజయసాయికి ఎక్కడలేని డిమాండ్.


ఇక ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వరకూ విజయ్ సాయినే వైసీపీ హోల్ అండ్ సోల్ అనుకుంటారు. ఆయన ద్వారానే తమ రాజకీయాన్ని నడుపుతారు. జగన్ సైతం భారమంతా విజయసాయి మీద వేస్తారని అంటారు. బీజేపీతో తెరచాటు దోస్తులైనా, ప్రశాంత్ కిషొర్ ని ఎన్నికల సలహాదారుగా పెట్టుకున్నా అన్నింటి వెనక విజయసాయి ఉన్నారని కూడా అంటారు.


జగన్ కి సలహాలు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా విజయసాయి ఇస్తారని, ఆయన సలహాను జగన్ తప్పకుండా  పాటిస్తారని అంటారు. అయితే ఇపుడు జగన్ విజయసాయిల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం  జరుతుతోందా అంటే ఏమో అలాగే ఉంది అంటున్నారు. టీడీపీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన సుజనా చౌదరి విజయసాయి మీద విరుచుకుపడుతూ నీ సన్యాసి సలహాల వల్లనే జగన్ భ్రష్టు పట్టిపోతున్నారని హాట్ కామెంట్స్ చేశారు


సుజనా తిట్టింది విజయసాయినైనా ఆ మాటలు జగన్ కి  డైరెక్ట్ గా త‌గిలేలా ఉన్నాయి. జగన్ చెప్పుడు మాటలు వింటారన్న అర్ధం వచ్చేలా సుజనా కామెంట్స్ ఉన్నాయి.  విజయ్ సాయి సలహాలతో జగన్ పాడవుతున్నారని చెప్పడం ద్వారా ఇటు వైసీపీలోనూ చిచ్చు రాజేశారు మరో వైపు జగన్, విజయసాయిల మధ్యన విభేదాలకు ఆజ్యం పోసారు. మరి సుజనా మాటలు వింటూంటే జగన్ చేసే కొన్ని పనులు నిర్ణయాలు వివాదాస్పదం కావడానికి విజయసాయి పాత్ర ఉందా అన్న డౌట్లు అటు పార్టీలో ఇటు జనంలో కూడా వస్తున్నాయి.


మరి విజయసాయిరెడ్డిని జగన్ ఈ విధంగా కామెంట్స్ వచ్చిన తరువాత కూడా ఎంటర్టైన్  చేస్తారా అన్నది చూడాలి. అసలు టీడీపీలో ఇంకో ప్రచారం కూడా ఉంది. విజయసాయిరెడ్డిని జగన్ని విడదీస్తే వైసీపీ సర్కార్ ఇబ్బందుల్లో పడుతుందన్నదే వారి వ్యూహం. దానికి మొదటి అంకంగా నిన్నటి తమ్ముడు ఈరోజు కాషాయదారి సుజన బాణాలు వేశారు. మరి ఇటువంటి మాటలకే కూలిపోయే బంధమా ఆ ఇద్దరిదీ..చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: