టీడీపీ పార్టీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఆ పార్టీ నేతలు ఇప్పటికే బీజేపీ తలుపులు తట్టి .. కొంత మంది చేరిపోయారు. ఇంకా పార్టీ మారే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. కీలక నేతలు కూడా ఏ ఈ జాబితాలో ఉండటం గమనార్హం. అయితే ఇప్పుడు ఉత్తరాంద్రకు చెందిన ఇద్దరు కీలక నేతలు టీడీపీకి రాజీనామా చేయడం ఇప్పుడు పార్టీలో తెగ చర్చ జరుగుతుంది. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తి పాడు స్థానం నుంచి పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయిన వరుపుల రాజా గురువారం పార్టీకి రాజీనామా చేశారు. వరుపుల రాజా గోదావరి జిల్లాలో మంచి పేరు ఉన్న నేత. కానీ జగన్ ధాటికి తట్టుకోలేక ఓడిపోయారు. ఆ తరువాత లిస్ట్ లో ..  మొన్నటి ఎన్నికల్లో విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ సీటు నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయిన ఆడారి ఆనంద్ కుమార్ వైసీపీలో చేరబోతున్నాడని టాక్ ఊపందుకుంది. 


టీడీపీ పార్టీ ఎన్నికలో ఘోర ఓటమి ... వీళ్ల రాజీనామాలకు దారి తీసింది. ఆ పార్టీ పరిస్థితి గత 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఘోరంగా క్షేత్ర స్థాయిలో దెబ్బతినిందంటే అతిశయెక్తి కాదని చెప్పాలి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అధినేత చంద్రబాబుతో పాటు ఆపార్టీ కార్యకర్తలు కూడా పెద్ద షాక్ కు గురయ్యారు. నిజానికి టీడీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను ఆ పార్టీ అధినేత పసిగట్టలేకపోయారు. చేసిన తప్పులను పదే పదే చేసుకుంటూ పోయారు.


దీనితో ఆ పార్టీ ఎప్పుడు చూడలేనంతగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 40 ఏళ్ల యువకుడైన జగన్ ..  రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లో అడుగు పెట్టి 40 ఏళ్ల ఇండస్ట్రీని పాతాళకంలోకి తొక్కేశారు. చంద్రబాబు చివర్లో ఎన్నో  సంక్షేమ పధకాలను ప్రవేశ పెట్టినా ప్రజలు వాటిని విశ్వసించలేదు. దీనితో బాబుకు మరో సారి ప్రతి పక్షంలో కూర్చోక తప్పలేదు. అయితే జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు, జగన్ సాధించిన భారీ మెజారిటీ ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే చంద్రబాబు భవిష్యత్ అంధకారంలోకి పోయినట్టేనని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: