వైసీపీ ఎంపీ, ట్విట్ట స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన ట్విట్లు చేశారు. ప్రతిరోజు ఏదొక విషయంపై ట్విట్టర్ లో విమర్శించే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దోపిడీ బయట పడకుండా ఎల్లో మీడియా కాపాడింది అంటూ ఘాటు విమర్శ చేశారు. 


విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ ''అధికారంలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు నాయుడు దోపిడీ బయట పడకుండా కాపాడిన ఎల్లో మీడియా ఇప్పటికీ బానిసత్వం కొనసాగిస్తూనే ఉంది. అసెంబ్లీ దొంగ కోడెల, ఆయన దూడల మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటోంది. సోషల్ మీడియా అనే మూడో కన్ను తెరుచుకుంది. మీరెంత మూసుకున్నా అది రెప్ప వాల్చదు.'' అంటూ  నారా లోకేష్ కి ట్యాగ్ చేశారు. 


ఈ ట్విట్ కు నెటిజన్లు స్పందిస్తూ ''ఎల్లో మీడియా ఇప్పటికి బుద్ది తెచ్చుకోవడం లేదు. ఈ ఎల్లో మీడియా లేకపోతే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు నిజాలు తెలుసుకుంటారు. ఎల్లో మీడియా ఉన్నంత వరుకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని అయోమయ స్థితిలో ప్రజలు ఉంటున్నారు. ఎల్లో మీడియా భూస్థాపితం అయ్యేవరకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందనివ్వదు ఈ యెల్లో మీడియా'' అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. మరి ఎల్లో మీడియా మరో అయిదేళ్ల వరుకు అయినా ఉంటుందా ? లేక భూస్థాపితం అవుతుందా అనేది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: