వైసీపీ ఎంపీ, ట్విట్ట స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన ట్విట్లు చేశారు. ప్రతిరోజు ఏదొక విషయంపై ట్విట్టర్ లో విమర్శించే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. గత రెండు రోజులుగా చంద్రబాబు నాయుడుపై ఫైర్ అవుతున్నారు విజయసాయి రెడ్డి. అభివృద్ధి అంటే రియల్ వ్యాపారం కాదని చంద్రబాబు నాయుడుపై కారాలు మిరియాలు నూరారు. 


విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ ''తొమ్మిదేళ్ల పదవీ కాలంలో హైదరాబాదును నిర్మించానని జబ్బలు చర్చుకునే పెద్దమనిషి 5 ఏళ్లలో అమరావతిలో 4 తాత్కాలిక భవనాలకు మించి ఎందుకు కట్టించలేక పోయారో చెప్పరు. అక్కడా, ఇక్కడా ఆయన బినామీలతో చేయించింది రియల్ వ్యాపారమే. అదే అభివృద్ధి అంటూ ప్రచారం చేస్తారు.'' అంటూ చంద్రబాబు నాయుడుని నారా లోకేష్ ని ట్యాగ్ చేసి ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి.   


దీంతో ఈ ట్విట్ చుసిన నెటిజన్లు స్పందిస్తూ 'గత ఐదేళ్ళలో చంద్రబాబు చేసింది... ఫారిన్ ట్రిప్స్, తన నాయకులకు తక్కువ ధరలకే భినామీ పేర్లతో భూములు ఎలా రిజిస్టర్ చేయాలి, జగన్ అన్నను టార్గెట్ చేస్తూ తిట్టినా వాళ్ళకి మినిస్టర్ పదవి ఇవ్వడం లేదా దోచుకోవడానికి సహకరించడం, ఎన్నికలు వస్తున్నాయి అనంగా చివరి దశలో పసుపు కుంకుమ లాంటి పథకాలతో ప్రజలను ఎలా బురిడీ కొట్టించాలి అంతే'' అండి చంద్రబాబు చేసింది. అంతకు మించి ఎం లేదు అంటూ కమిటీలు పెట్టారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: