మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం అవినీతి కేసులో అరెస్ట్ అయిన సంగతీ తెలిసిందే. అయితే ఈ కేసులో కోర్ట్ చిదంబరం కస్టడీని పొడిగించుతూ తీర్పును ఇచ్చింది. అయితే కోర్టులో చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కేసును తానే వాదించుకుంటానని చెప్పారు. ప్రస్తుతం చిదంబరం కేసును కపిల్ సిబాల్ వాదిస్తున్న సంగతీ తెలిసిందే.అయితే కపిల్ సిబాల్ వాదనల పట్ల సంతోషంగా లేని చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి సీబీఐ అడ్డు తగిలింది. దానికి చిదంబరం నేను మీద దయ మీద లేనని , కోర్ట్ యెక్క దయతో ఉన్నానని చెప్పారు. అయితే చిదంబరం కస్టడీని పొడిగించడంతో మరి కొన్ని రోజులు చిదంబరం సీబీఐ కస్టడీలోనే ఉంటారు. 


అయితే ఈడీ నుంచి అరెస్ట్ ను తప్పించేందుకు చిదంబరం తరుపున లాయర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్ట్ తమ తీర్పును సెప్టెంబర్ 5వ తేదికి వాయిదా వేసింది. దీనితో ఈడీ కేసులో బెయిల్ వస్తుందా ... అని చెప్పాలంటే చిదంబరం 5వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే. ఇంకొక పక్క సీబీఐ కేసులో చిదంబరంకు ఉపశమనం కలగలేదు. అయితే చిదంబరం .. కోర్ట్ ముందు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇంట్రాగేషన్ పేరుతో తనను అవమానిస్తున్నారని తాను ఇంట్రాగేషన్ కు సహకరించడం లేదని .. ఈడీ తప్పుడు సమాధానాలు చెబుతుందని వాపోయారు.


అయితే చిదంబరంకు ఇప్పుడు అసలైన భాద తెలుస్తుంది. తాను అధికారంలో ఉన్నప్పుడు ఇలానే ప్రత్యర్థులను వేధించి జైలుకు తరలించారు. పాపం అప్పుడు చిదంబరంకు ఆ భాద తెలియలేదు. ఇప్పుడు రాజకీయ కక్ష అని .. నన్ను కావాలనే వేధిస్తున్నారని వాపోతున్నారు. అయితే చిదంబరం 2017 నుంచి తప్పించుకుంటూ ఎన్నో స్టే లు తెప్పించుకున్నారు ..  చిదంబరం అతని కొడుకు కార్తీ. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చిదంబరం కేంద్ర మంత్రిగా పని చేసిన సంగతీ తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: