స‌మాజంలో రోజు రోజుకు మాన‌వ సంబంధాలు దిగ‌జార‌డం ఒక‌టి అయితే చిన్న వ‌య‌స్సు నుంచే పిల్ల‌లు ఎలా చెడిపోతున్నారో చెప్పేందుకు ఈ సంఘ‌ట‌నే నిద‌ర్శ‌నం. ప‌క్క ప‌క్క ఇళ్ల‌లో ఉంటోన్న ఇద్ద‌రు మైన‌ర్లు తెలిసీ తెలియ‌ని వయ‌స్సులో ఆక‌ర్ష‌ణ‌కు లోన‌య్యారు. చేయ‌రాని ప‌ని చేశారు. ఫ‌లితంగా బాలుడు చేసిన త‌ప్పుతో బాలిక గ‌ర్భం దాల్చింది. బాలికను గర్భిణిని చేసిన తొమ్మిదివ తరగతి విద్యార్థిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేసిన సంఘటన తిరువణ్ణామలైలో చోటు చేసుకుంది. ఈ సంఘ‌ట‌న పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.


త‌మిళ‌నాడులోని తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలుకా పడవేడు సమీపంలోని ఒక గ్రామానికి చెందిన 12 సంవత్సరాల బాలిక. ఈమె అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతోంది. బాలిక పక్కింటికి చెందిన 15 సంవత్సరాల బాలుడు కూడా అదే పాఠశాలలో తొమ్మిదివ తరగతి చదువుతున్నాడు. వీరి ఇద్దరు స్నేహంగా ఉంటున్నారు. వీరిద్ద‌రు తెలిసి తెలియ‌ని వ‌య‌స్సులో ఆక‌ర్ష‌ణ‌కు లోన‌య్యి ప్రేమించుకున్నారు. అక్క‌డితో ఆగ‌కుండా హ‌ద్దులు దాటేశారు.


ఈ నేప‌థ్యంలోనే బాలిక ప్రెగ్నెంట్ అయ్యింది. ఆమె ఆరోగ్యం క్షీణించ‌డంతో కుటుంబ స‌భ్యులు రెండు రోజుల క్రితం హాస్ప‌ట‌ల్‌కు తీసుకువెళ్లారు. అక్క‌డ ఆమెను ప‌రీక్షించిన వైద్యులు బాలకకు ఐదు నెలలు గర్భమని నిర్దారించారు. అవాక్కైన తల్లిదండ్రులు కుమార్తె వద్ద విచారించారు. ఆ సమయంలో చిన్నారి పక్క ఇంటికి చెందిన విద్యార్థితో చనువుగా ఉన్నట్లు తెలిపింది. దీంతో ఆ త‌ల్లిదండ్రులు ఒక్క‌సారిగా షాక్ అయ్యారు.


దీంతో బాలిక తల్లి ఆరణి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి బాలుడిని పోక్సో చట్టం కింద  అరెస్ట్‌ చేసి కోర్టులో హజరు పరిచారు. అనంతరం బాలికను శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: