తెలుగు రాష్ట్రాల్లో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. భారీగా నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా తొలిసారి గణేష్ మండపాలకు కూడా వాతావరణ శాఖ సూచనలు చేసింది.


ఇవాళ్టి నుంచి మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. బంగాళాఖాతం పశ్చిమ మధ్య ప్రాంతంలో 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు పేర్కొంది. అటు మధ్యప్రదేశ్‌పై 3.6 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.


వర్షాకాలంలో వినాయక చవితి ప్రతి ఏడాది వస్తుంది. అయితే వినాయక పందిళ్లలో వర్షాలు పడ్డ విగ్రహాలకు ఏ ఆటంకం రాకుండా పైన పటిష్టంగా నిర్మిస్తారు. విగ్రహాలను నిమజ్జనం ఊరేగింపు తీసుకువెళ్ళేటప్పుడు వర్షం పడ్డా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ పందిళ్ళు అంతగా పటిష్టంగా లేని వారికి మాత్రం ఇది చాలా కష్టంగా ఉండే సమయం. ఎందుకంటే వర్షం వలన కింద పూజ సామగ్రి మాత్రమే కాదు చేసిన మట్టి విగ్రహాలు కరిగిపోయే అవకాశం ఉంది.


పైగా పూజ జరిగిన ప్రతిసారీ బయట ఎంతో మంది భక్తులు నిలబడి లేదా కూర్చుని ఉంటారు అలాంటప్పుడు వర్షం పడితే వాళ్లందరూ నీడ కోసం ఎక్కడికక్కడ వెళ్లి పోవాల్సి వస్తుంది. దగ్గర అన్ని చోట్ల సౌలభ్యంగా ఉండవు కాబట్టి వర్షాకాలంలో వినాయక చవితి సంబరాలు ఎప్పుడూ జరగడం అనేది సహజం. కనుక వాతావరణం కేంద్రం వాళ్ళు ముందుగానే వినాయక చవితి పండుగ నాటి నుంచి ఏర్పాటు చేసే పనులు అన్ని పటిష్టంగా చేసుకోవాలని ఏర్పాట్లన్నీ తదనుగుణంగా చేసుకోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: