నాకో తిక్కుంది.. దానికో లెక్కుంది అనే డైలాగ్ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్. ఈ డైలాగ్ ఎంతగా పేలించి అంటే చెప్పక్కర్లేదు. సినిమాలో ఈ డైలాగ్ వచ్చిన కాంప్లిమెంట్ అంతాఇంతాకాదు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ తనదైన శైలిలో గబ్బర్ సింగ్ ప్రత్యక్షమయ్యి న్యాయం చేసేవాడు. అలాంటి న్యాయం చేసింది ఓ మహిళా. బీహార్ కు చెందిన అభాదేవి.
ఎవరీ అభాదేవి అని షాక్ అవ్వకండి. అక్కడికే వస్తున్నా.. అభాదేవి బీహార్ లోని పాట్నా జిల్లాలో ఉన్న అలంపూర్ గోన్ పురా గ్రామ పంచాయితీకి సర్పంచ్. పేరుకు ఆమె సర్పంచ్ మాత్రమే అనుకుంటే షాక్ అవుతారు. తన న్యాయం కూడా అలానే ఉంటుంది. మహిళలపై ఎవరైనా సరే తిరగడబడినా, వాళ్లకు అన్యాయం చేయాలనీ చూసినా వెంటనే అక్కడ ప్రత్యక్షం అవుతుంది. అల్లరి మూకలపై దాడి చేసి మహిళలను రక్షిస్తుంది.
మొత్తంగా చెప్పాలి అంటే ఆమె ఒక రౌడీ గబ్బర్ సింగ్. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోదు. ఇలా రౌడీ గ్యాంగ్ పై ఓసారి తిరగబడి వారిని కొట్టినందుకు కోపంతో ఆ రౌడీలు ఆమెపై కాల్పులు జరిపారు. చాకచక్యంగా తప్పించుకుంది. ఆ తరువాత భర్త సహాయంతో పిస్తోలు కొని షూటింగ్ నేర్చుకుంది. లైసెన్స్ కు అప్లై చేసింది. ప్రభుత్వం ఆమెకు క్షణాల్లో లైసెన్స్ ఇచ్చింది.
ఈ గ్రామ పంచాయితీ పరిధిలో మొత్తం 13 గ్రామాలు ఉన్నాయి. ఈ 13 గ్రామా ల్లో ఎక్కడ ఎలాంటి గొడవ జరిగినా వెంటనే అభాదేవి అక్కడ ప్రత్యక్షం అవుతుంది. ఆమె వస్తుంది అంటే రౌడీ మూకలు పరార్ అవుతారు. అంతేకాదు, ఆ చుట్టుపక్కల పట్టణాల్లో కూడా ఎవరైనా మహిళలు వచ్చి తమను ఈవ్ టీజింగ్ చేస్తున్నారని పోలీసులకు కంప్లైంట్ చేస్తే.. వాళ్ళు అభాదేవిని వెళ్లి కలవమని చెప్తున్నారట. ఆలా చేస్తే న్యాయం జరుగుతుందని చెప్పడం విశేషం. ఇప్పుడు ఆమె పేరు పాట్నా జిల్లాలో మారుమ్రోగిపోతున్నది.