భారత్ తో యుద్ధం చేసే సత్తా పాక్ లేదని దానికి కూడా తెలుసు. కానీ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. తాజాగా ఇమ్రాన్ ఖాన్ మా దగ్గర అణు బాంబులు ఉన్నాయి. ప్రపంచం ప్రమాదంలో ఉందని ఏదేదో చెబుతున్నారు. నిజానికి పాక్ యుద్దానికి సిద్ధం అయితే భారత్ కూడా సిద్ధంగా ఉంది. పనిలో పనిగా పాక్ ఆక్రమిత కాశ్మీరును కూడా భారత్ చేజిక్కించుకుంటుంది. ఆ విషయం కూడా పాక్ కు తెలుసు. అయినా ఇంకా మొరుగుతూనే ఉంది. ఇన్ని రోజులు కాశ్మీర్ కు స్వయం ప్రతి పత్తి ఉండటంతో పాక్ చాలా ఆటలు ఆడింది. కానీ ఇప్పుడు పీఓకే ను పాక్ కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ మాత్రం తేడా జరిగిన భారత్ .. పీఓకేను భారత్ లో కలిపేసుకుంటుందని పాక్ కు బాగా తెలుసు.


అయితే కాశ్మీర్ విషయంలో ఐరాస పట్టించుకోకపోవడంతో . .పైగా ఇది భారత్ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పడంతో పాక్ ఎక్కడ లేని అసహనానికి గురవుతోంది. అందుకే విచక్షణ కోల్పోయి రాబోయే రోజుల్లో భారత్ తో పూర్తి స్థాయి యుద్ధం తప్పదని పిచ్చి కూతలు కూస్తుంది. మా దగ్గర అను బాంబులు ఉన్నాయి అంటూ ఇమ్రాన్ ఖాన్ పిచ్చోడి మాదిరిగా మాట్లాడుతున్నారు. దీనితో పాకిస్థాన్ అంతర్జాతీయ సమాజంలో ఏకాకిలా మారింది.


 కాశ్మీర్ కు ఉన్న స్వయం ప్రతిపత్తిని కేంద్రం తొలిగించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేసి, భారత్ తన భూ భాగంలో కలిపేసుకుంది. దీనితో పాకిస్థాన్ ఎక్కడ లేని ఆందోళనకు గురైంది. ఈ విషయంలో ప్రపంచ దేశాలు కూడా పాక్ కు సహాయంగా రాకపోవటంతో ఇంకా ఫ్రస్టేషన్ కు పాక్ గురౌతుంది. దీనితో విచక్షణ కోల్పోయి యుద్ధం అంటూ పరువును పోగొట్టుకుంటుంది. దీనితో ప్రపంచ దేశాలు కూడా పాక్ ను లైట్ తీసుకుంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: