వైసీపీ ఎంపీ, ట్విట్ట స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన ట్విట్లు చేశారు. ప్రతిపక్షాన్ని విమర్శించడమే పనిగా భావించే విజయసాయి రెడ్డి ప్రతిపక్ష పార్టీలో ఏ తప్పులు ఉన్నాయో ఆ తప్పులు అన్ని వెతికి మరి బయటకి తీస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ఒకే స్క్రిప్ట్ ఫాలో అవుతున్న ఇద్దరు నేతలు అంటూ ట్విట్ పెట్టాడు.  


విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ 'యజమాని, ప్యాకేజీ ఆర్టిస్ట్ కలిసి ఒకే స్క్రిప్ట్ చదువుతున్నారు. ఆయనేమో ఎందుకు ఓడిపోయానో తెలియదంటాడు. రెండు చోట్ల అడ్రసు గల్లంతైన పార్టనర్ ఏమో కాలం కలిసొచ్చో, ఈవీఎంల చలవతోనే గెలిచారంటారు. ఆ 23 సీట్లలో ఆయనను, ఒక్క స్థానంలో పార్ట్‌నర్‌ను ఎవరు గెలిపించారో?' అంటూ ట్విట్ చేస్తూ చంద్రబాబు నాయుడు ని పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేశారు. 


దీంతో ఈ ట్విట్ చుసిన నెటిజన్లు స్పందిస్తూ 'పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి గత 5 సంవత్సరాలు రాష్టాన్ని నాశనం చేసారని, ఇప్పుడు రాష్ట్ర ప్రజల ఆలోచనలను పక్క దరి పట్టిస్తున్నారని కొందరు అన్నారు.. మరి కొందరు స్పందిస్తూ 'పవన్ కళ్యాణ్, చంద్రబాబు.. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరూ చూస్తున్నారు ఏ నాయకుడు ఎలాంటివాడో.. ఎవరు మాటలు ఎలా ఉన్నాయి అనేది 2024 లో పవన్ కళ్యాణ్ కి చంద్రబాబుకి డిపాజిట్లు కూడా రావు ఇది పక్క'' అంటూ మరి కొందరు స్పందిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: