విజయవాడ తెలుగు దేశం పార్టీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ లో మరోసారి సంచలనం సృష్టించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఎన్నో అవకాశాలను కోల్పోతుందని అంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేధికగా విమర్శలు గుప్పించారు.


ట్విట్టర్ లో కేశినేని నాని ట్విట్ పెడుతూ  "ఆర్థిక మాంద్యం ఏర్పడిన సమయంలో ఏ దేశమైనా ఉద్దీపన ప్యాకేజీలతో వ్యయ నిర్వహణకు ఊతమిస్తుంది. తద్వారా ఆర్థిక పరిస్థితులను సమతుల్యం చేస్తుంది. ఇక అమరావతి నిర్మాణం విషయానికి వస్తే, ఇక్కడ ఆర్థిక అద్భుతాలు జరుగుతున్నాయి. ఇవన్నీ అవకాశాలను దూరం చేస్తున్నాయి" అంటూ సెటైర్ వేశారు.


అయితే ఈ సెటైర్ కేశినేని నాని 'ఇంగ్లీష్'లో పెట్టారు. ఈ సెటైర్ ట్విట్ లో ప్రసాద్‌ వి పొట్లూరి (పీవీపీ) కి ఓ లోపం కనిపించింది. కేశినేని నాని రాసిన RECESSION స్పెల్లింగ్ తప్పు. ఈ విషయంపై పొట్లూరి ట్విట్ చేస్తూ ''మిస్టర్. ఎంపీ, RECESSION స్పెల్లింగ్ కూడా రాని వాడివి, మా కర్మ కాకపోతే, నీకెందుకయ్యా, ఎకానమీ గురించి స్టేట్మెంట్స్!'' అంటూ ట్విట్ చేస్తూ కేశినేని నాని'ని ట్యాగ్ చేశాడు పొట్లూరి. 


 ఈ ట్విట్ చుసిన కేశినేని నాని ఉరికే ఉంటాడా ? లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చెయ్యాడు. ఈ నేపథ్యంలోనే కేశినేని నాని ట్విట్ చేస్తూ ''ఆర్థిక నేరస్థులు కూడా పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగానని భావించటం అంటే తప్పకుండా ఈ రాష్ట్రానికి పట్టిన కర్మే.'' అంటూ ట్విట్ చేశాడు కేశినేని నాని. 


అయితే ఈ ట్విట్ చూసిన నెటిజన్లు మాత్రం కేశినేని పెట్టిన ట్విట్ పై ఘోరంగా విరుచుకుపడుతున్నారు. 'ఏంటి కేశినేని నాని, మీరేమైనా కేశినేని ట్రావెల్స్ ని అన్ని నిబంధనలకు అనుగుణంగా రన్ చేశారా, మీరు చెప్పినట్టు అయితే ఏ రాజకీయ నాయకుడు ఎవరికి ఏమి చెప్పకూడదు' అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: