రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడాలని తెగ ఉబలాటపడుతుంది. అందుకే టీడీపీ నుంచి నేతలు ఇష్టానుసారం లాగేస్తుంది. అయినా బీజేపీ .. టీడీపీ నేతలతో బలపడటం కష్టమని ఆ పార్టీకి కూడా తెలుసు. ఇప్పటీకే జగన్ ప్రజా రంజక పరిపాలనతో దూసుకుపోతున్నారు. జగన్ మెజారిటీ కూడా అసాధారణం. దీనితో బీజేపీ .. ఏపీలో జగన్ ను తట్టుకోవటం కష్టమని .. అందుకే జగన్ తో స్నేహ హస్తమే మంచిదని భావిస్తుంది. కానీ తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా బలపడుతామని చెబుతుంది. తెలంగాణలో బలపడటం సులభం గాని ఏపీలో బలపడటం కష్టమని ఆ పార్టీ భావిస్తుంది. తెలంగాణలో వయసు రీత్యా కేసీఆర్ ఎక్కువ రోజులు రాజకీయాలు చేయలేరు.


తరువాత కేటీఆర్ నాయకత్వాన్ని ఎంత మంది ఆమోదిస్తారో తెలియదు. కానీ ఏపీలో పరిస్థితి అలా లేదు. జగన్ భారీ మెజారిటీతో గెలిచారు. పైగా యువకుడు. ఇంకా మూడు దశాబ్దాలు రాజకీయాలు చేయగలడు. పైగా చంద్రబాబును తొక్కాలంటే జగన్ తోడు అవసరమని బీజేపీ భావిస్తుంది. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అయితే అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. కేంద్రం స్థాయిలో మోడీ హవాతో దేశం మొత్తం స్వీప్ చేసింది. దీనితో కేంద్రంలో బీజేపీకి తిరుగు లేకుండా పోయింది.


అయితే అన్ని రాష్ట్రాల్లో చివరికి సౌత్ లోని కర్ణాటకలో కూడా బీజేపీ హవా స్పష్టంగా కనిపించినా ఏపీ లో మాత్రం లేదు. జగన్ .. 30 ఏళ్ల టీడీపీని మట్టికరిపించి 25 పార్లమెంట్ స్థానాల్లో ఏకంగా 22 స్థానాలు గెలుచుకొని సరికొత్త సునామీని సృష్టించారు. అయితే తెలంగాణలో మాత్రం బీజేపీ అనూహ్యంగా 4 ఎంపీ స్థానాలను గెలుచుకొని ఔరా అనిపించింది. దీనితో తెలంగాణలో బీజేపీ పాగా వేయాలని దృడంగా నిశ్చయించుకుంది. అమిత్ షా కూడా తెలంగాణ మీద గట్టిగా ఫోకస్ చేశారు. తెలంగాణలో తెరాస కు తామే ప్రధాన ప్రతి పక్షమని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీనితో తెరాస లో ఎక్కడ లేని ఒణుకు మొదలైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: