గ‌త కొద్దికాలంగా టీఆర్ఎస్ పార్టీపై దూకుడుగా స్పందిస్తున్న టిపిసిసి క్యాంపెయిన్ కమిటీ చైర్‌పర్శన్ విజయశాంతి తాజాగా మ‌రో అంశంపై స్పందించారు. తెలంగాణలో విష జ్వ‌రాలు...టీఆర్ఎస్ పార్టీ అంత‌ర్గత రాజ‌కీయాల గురించి ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టిన రాములమ్మ‌....విష జ్వ‌రాల‌పై కొత్త పాయింట్ లేవ‌నెత్తారు. గ‌త కొద్దికాలంగా వార్త‌ల్లో నిలుస్తున్న ఈట‌ల రాజేంద‌ర్‌ను ఇందులో ప్ర‌స్తావించారు.


విజ‌య‌శాంతి పెట్టిన ఫేస్‌బుక్ పోస్ట్ ఇది...``తెలంగాణ జనం అంతా విష జ్వరాలతో అల్లాడుతుంటే అధికార టీఆర్ఎస్ పార్టీలో మాత్రం గులాబీ జెండాకు బాస్ ఎవరు? అని ఓ వర్గం... కెసిఆర్ తప్ప గులాబీ జెండా కు బాస్ ఎవరు లేరని మరో వర్గం వాదించుకుంటూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. అందరికంటే తనకు రాజకీయాల్లోనూ పాలనాపరంగా ముందుచూపు ఉందని ప్రకటించుకునే కెసిఆర్ గారు.. విష జ్వరాలతో ప్రజలు పడే బాధల విషయంలో మాత్రం ఎందుకు జాగ్రత్త చర్యలు తీసుకోలేదో జనానికి అంతుబట్టడం లేదు. ఆరోగ్య సమస్యలను కారణంగా చూపించి... తనను బలిపశువును చేయాలని కుట్ర జరుగుతోందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు సన్నిహితులతో వాపోయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో డెంగ్యూ జ్వరాలు స్వైన్ ఫ్లూ వంటి జ్వరాలతో జనం ఆస్పత్రులలో బారులు తీరుతున్నప్పటికీ.. ఆరోగ్య శాఖ మంత్రి మాత్రం దీనిని పెద్ద సీరియస్‌గా పరిగణించాల్సిన అవసరం లేదని పరిస్థితిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్య లోపం వల్లే విష జ్వరాలు ప్రబలుతున్నాయనే వాదన కూడా ఉంది. ఈ రోజు ఈటల రాజేందర్ గారు జిహెచ్ఎంసిలో సమావేశం నిర్వహించి... ఇదే అంశాన్ని ప్రస్తావించడం వెనుక కారణం కూడా లేకపోలేదు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి కనుసన్నల్లోనే ఇప్పటికీ జిహెచ్ఎంసితో పాటు మున్సిపల్ వ్యవస్థ నడుస్తోంది అన్నది జగమెరిగిన సత్యం. ఒకవేళ ఈ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వివాదంలో తనను ఇరికించాలని అనుకుంటే పరోక్షంగా ఈ సమస్యను కేటీఆర్ గారిమెడకు చుట్టాలని ఈటల రాజేందర్ గారు భావిస్తున్నట్లు టిఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఓవైపు ఇంత బీభత్సం జరుగుతున్నా.... మాజీ మంత్రి హరీష్ రావు గారు మాత్రం సందట్లో సడేమియా అన్న చందంగా... తన అనుచరులతో వెయ్యి కొబ్బరి కాయలు కొట్టించి... తాను ముఖ్యమంత్రి అవ్వాలని మొక్కులు చెల్లిస్తూ... చాపకింద నీరులాగా పావులు కదుపుతున్న విషయం స్పష్టమైంది. బంగారు తెలంగాణ చేసి చూపుతామని అధికారంలోకి వచ్చి కేసీఆర్ అండ్ కో ఏ రకంగా అధికార దాహంతో ప్రజల జీవితంతో ఆడుకుంటుందో ఇటీవల పరిణామాలు చూస్తే అర్థమవుతుంది.`` అని టీఆర్ఎస్ నేత‌లంద‌రినీ టార్గెట్ చేశారు విజ‌య‌శాంతి.


మరింత సమాచారం తెలుసుకోండి: