అధికారం ఉన్నప్పుడు అతి ధీమాతో మాట్లాడి రోజు మీడియాలో హల్చల్ చేసిన టీడీపీ నేతల్లో యామిని సాధినేని ఒకరు.  టీడీపీలో చేరిన తక్కువ కాలంలోనే ఫైర్ బ్రాండ్ గా ఎదిగిన యామిని అప్పుడు సీఎం చంద్రబాబు అండతో....రోజు మీడియా ముందుకొచ్చి వైసీపీపై, ఆ పార్టీ అధినేతపై చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు. అలాగే ఆమె బీజేపీ, పవన్ కల్యాణ్ లు పైన కూడా తీవ్ర విమర్శలు చేసింది. రోజు భోజనం అయిన సమయానికి చేస్తుందో లేదో తెలియదుగానీ అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు మాత్రం టైముకు చేసేవారు.


అలాంటి యామిని ఇప్పుడు టీడీపీ అధికారం కోల్పోగానే అడ్రెస్ లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు మూడు రోజులు మీడియాలో కనిపించింది గానీ ఆ తర్వాత నుంచి సైలెంట్ అయిపోయింది. టీడీపీ అధికార ప్రతినిధి అయ్యి ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ క్రమంలోనే ఆమె ఇటీవల బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణతో దిగిన ఓ ఫోటోలో తళుక్కుమంది దీంతో అంతా ఆమె బీజేపీలోకి జంప్ అయిపోతుందని అనుకున్నారు.


ఆ ఫోటో వచ్చి కూడా నెలరోజులు పైనే అవుతుంది. అయిన ఆమె సైలెంట్ గానే ఉండిపోయింది. అలా సైలెంట్ గా ఉన్న ఆమె సడన్ గా బయటకొచ్చి అసలు విషయం చెప్పింది. తన వ్యక్తిగత కారణాల వల్లే రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు చెప్పిన ఆమె దేశంలో బీజేపీ - రాష్ట్రంలో వైసీపీని అఖండ మెజార్టీతో ప్రజలు గెలిపించారని.. వారికి కాస్త సమయం ఇవ్వాలనే తాను సైలెంట్ గా ఉంటున్నట్టు ప్రకటించారు.


ఇంకా మూడు నెలల పాటు వారి పరిపాలనను చూస్తానని, తర్వాత అభిప్రాయం చెబుతానని అన్నారు. కాకపోతే చంద్రబాబు ఫోన్ చేసి యాక్టివ్ గా ఉండాలని కోరారని, అయినా తన వ్యక్తిగత కారణాల వల్లే ప్రస్తుతానికి సైలెంట్ అయ్యానని వివరించారు. అటు పార్టీ మార్పుపై కూడా ఆమె స్పదించారు. తాను టీడీపీని వీడి ఏపార్టీలోకి వెళ్తాననే విషయంపై మాట్లాడదలుచుకోలేదు అని ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. మొత్తానికి అధికారంలో ఉన్నప్పుడు చెలరేగి మాట్లాడిన యామిని...అధికారం కోల్పోయాక సైలెంట్ అయిపోయారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: