గృహ నిర్బంధం లో ఉన్న తల్లి ని కలిసేందుకు జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూతురు సనా ఇల్తిజార్ జావేద్ ను సుప్రీం కోర్టు అనుమతించింది ఐతే శ్రీ నగర్ లో స్వేచ్ఛ గా పర్యటించే విషయమై స్థానిక అధికారుల అనుమతి తీసుకోవలసి ఉంటుందని స్పష్టం చేసింది. అలా జరగని పక్షం లో నిబంధనలకు లోబడి ముఫ్తీ ని చూడవచ్చని తెలిపింది. 


జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు రాష్ట్ర విభజన నేపథ్యంలో కశ్మీర్ మాజీ ముఖ్య మంత్రి మెహబూబా ముఫ్తీ సహా ఒమర్ అబ్దుల్లా ను గృహ నిర్బంధం లో ఉంచిన సంగతి తెలిసిందే.  పార్టీ కార్యకర్తలు న్యాయవాదులు ఆఖరికి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడేందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదని సనా అన్నారు. అదే విధంగా కశ్మీర్ లో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను కూడా ఆమె తీవ్రంగా విమర్శించారు. ఈ క్రమంలో తన తల్లిని కలిసేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడం లేదని ఇల్తిజార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

 చెన్నై కి వెళ్లేందుకు మాత్రం అనుమతించారు కానీ శ్రీనగర్ లో స్వేచ్ఛ గా తిరగకుండా అడ్డు కుంటున్నార ని పిటిషన్ దాఖలు చేశారు. తన తల్లి తో వ్యక్తిగతం గా మాట్లాడేందు కు పర్మిషన్ ఇవ్వాలన్న ఇల్తిజార్ అభ్యర్థనపై స్పందించిన సుప్రీం కోర్టు ఆమె పిటిషన్ ను విచారించింది ఇందులో భాగంగా ఇల్తిజార్ శ్రీ నగర్ కు వెళ్లేందుకు ఎందుకు అనుమతించడం లేదని సీజీఐ రంజన్ గోగోయ్ ప్రభుత్వ తరపు న్యాయవాది ని ప్రశ్నించారు. 

ఇందుకు బదులు గా స్థానిక జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి తో ఇల్తిజార్ ముఫ్తీ ని కలవొచ్చని చెప్పినట్లు తెలిపారు. ఇరువర్గాల వాదనల అనంతరం ఇల్తిజార్ తన తల్లి ని కలిసేందుకు సర్వోన్నత న్యాయ స్థానం అనుమతించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: