విరాట్ కోహ్లీ విజయంతో చాలా హ్యాపీగా ఉన్నాడు.  వరసగా మ్యాచ్ లు గెలుస్తూ.. విజయాలు సాధిస్తున్నాడు.  తాజాగా విరాట్ కోహ్లీ ఓ ఫోటో షాట్ షూట్ చేశారు.  ఈ ఫోటో షూట్ ను చూసి చాలా మంది షాక్ అయ్యారు.  కోహ్లీ నిక్కరు మాత్రమే వేసుకొని కూర్చొని ఉన్న ఫోటో అది.  మాములుగా ఆ ఫోటో చూస్తే.. అదేంటి విరాట్ కోహ్లీ అలా ఎందుకు కూర్చున్నాడు.  విషయం ఏంటి అనే డౌట్ వస్తుంది.  


ఈ ఫోటో ఎందుకు షూట్ చేశారనే విషయాన్ని పక్కన పెడితే... ఈ ఫొటోకు వస్తున్న కామెంట్స్ మాత్రం చాలా విచిత్రంగా ఉంటున్నాయి.  ప్రస్తుత సామజిక పరిస్థితులకు అనుగుణంగా అన్వయించి మెసేజ్ లు చేస్తున్నారు.  ఈ మెసేజ్ లు చాలా విచిత్రంగా ఉంటున్నాయి.  విరాట్ కోహ్లీ ట్రాఫిక్ చలానా కట్టలేదని, అందుకే బట్టలు ఊడదీసి పంపించారని కొందరు మెసేజ్  చేశారు,.  


అసలు విరాట్ కోహ్లీ ఈ ఫోటోను ఎందుకు షేర్ చేశారు... కారణం ఏంటి  అని ఆలోచిస్తే.. విరాట్ కోహ్లీ ఈ ఫోటోను సరదాగా పోస్ట్ చేసి.. సీరియస్ గా ఫిలాసఫీ మెసేజ్ ను చేసాడు.. "మన అంతరంగంలోకి మనం చూసుకున్నంత కాలం.. బయటి దేని గురించి మనం వెతకవలసిన అవసరం లేదు" అని మెసేజ్ చేశాడు.   


ఈ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  విరాట్ కోహ్లీ ట్రాఫిక్ చలానా కట్టావా ఏంటి అని కొందరు స్పందిస్తున్నారు.  బట్టలు వేసుకొని కూడా అంతరంగ విషయం గురించి చెప్పొచ్చని కామెంట్స్ చేస్తున్నారు.  ఇలా రాకరకరాలుగా ఎవరికీ ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు.  పాపం ఈ కామెంట్స్ ను విరాట్ కోహ్లీ చూస్తే... చెప్పాల్సిన అవసరం లేదు.  సీరియస్ కావడం ఖాయం.  అనుష్కతో గొడవపడ్డవా ఏంటి అని మెసేజ్ చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: