వంగవీటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో చెరగని ముద్రవేసిన ఫ్యామిలీలలో ఒకటి. ముఖ్యంగా విజయవాడ రాజకీయాన్ని తన కనుసన్నల్లో నడపగల సత్తా ఉన్న కుటుంబం. కానీ ప్రస్తుతం వారికీ రాజకీయంగా చాలా గడ్డుకాలం నడుస్తున్నట్టు అర్థమౌతుంది. ఎన్నికల వరకు వైసీపీలో ఉన్న రాధా ..ఆ ఎన్నికలలో సీటు ఇవ్వలేను అని సీఎం జగన్ చెప్పడంతో వంగవీటి రాధా ఎన్నికలకు ముందు జగన్‌తో విభేదించి వైసీపీ గుడ్ బై చెప్పారు. ఆ తరువాత  చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. సీటు రాకపోయినా దక్కకపోయినప్పటికీ పార్టీ అధికారంలోకి వస్తే కీలక పదవి వస్తుందని భావించారు. 

దీనితో ఆ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా మారి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ తరపున ప్రచారం నిర్వహించారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు తిరిగి ఏపీకి ముఖ్యమంత్రి కావాలని మూడు రోజుల పాటు శ్రీయాగం కూడా చేశారు. ఎన్నికల తర్వాత పరిస్థితి మారిపోయింది.. వైసీపీ అధికారంలోకి రావడంతో వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్ సందిగ్థంలో పడింది. కనీసం వైసీపీలో ఉన్నా కూడా జగన్ హామీ మేరకు కనీసం ఎమ్మెల్సీ అయిన దక్కేది. దీనితో రాజకీయ భవిష్యత్ కోసం రంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. 

అదేమిటంటే ...టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారా అంటే ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా అవుననే చెప్తున్నాయి .   రంగా  జనసేన పార్టీ సమావేశాలు జరుగుతున్న తూర్పుగోదావరి జిల్లా దిండి రిసార్ట్స్‌‌‌‌‌కు వెళ్లారు. అక్కడ జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఆ తరువాత అక్కడే ఉండి జనసేన అధినేత  పవన్ కళ్యాణ్‌తోనూ వంగవీటి భేటీ అయ్యారు. గత  మూడు నెలల క్రితం కూడా రాధా విజయవాడలో పవన్‌ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. జనసేనాని ఇంటికి వెళ్లి అరగంటపాటూ చర్చలు జరిపారు. అప్పట్లోనే వంగవీటి   జనసేన పార్టీలో చేరతారని చర్చ మొదలయ్యింది. కానీ, ఆ తరువాత అలాంటిదేమి జరగలేదు. కానీ మరోసారి రంగా పవన్ ని కలవడంతో ఈసారి రంగా పార్టీ మారడం ఖాయం అని చెప్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: