గుట్టుగా చేసుకుంటే అది సంసారం.. ఆ గుట్టును రట్టు చేసి రచ్చబండ వరకు వెళ్లి కొట్టుకుంటే.. అది సంసారం కాదు.. మరేదో అవుతుంది. అందుకే సంసారాన్ని గుట్టుగా చేసుకోవాలని పెద్దలు సూచిస్తుంటారు. పెద్దలు చెప్పినట్టుగా చేశారు కాబట్టే ఆ కాలంలో చాలామంది సుఖంగా హాయిగా ఉన్నారు. కానీ, ఇప్పుడు ఈ కాలంలో అన్ని మారిపోయాయి. పద్ధతులు మారిపోయాయి. గుట్టుగా సాగాల్సిన సంసారం గుమ్మం దాటి వీధిన పడుతున్నది. ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి.
చిన్న చిన్న వాటికే గొడవలు.. రాద్ధాంతాలు.. విడాకులు.. ఈ సమస్య మన దేశంలోనే కాదు ప్రతి చోట ఉన్నది. మనదగ్గర చాలానయం. విదేశాల్లోనైతే భార్యపై కోపం వస్తే భర్త చంపేస్తాడు.. అదే భర్తపై కోపం వస్తే భర్త కూడా పగతీర్చుకుంటుంది. ఉక్రెయిన్ లోని ఓబరివ్ కు చెందిన మారియా అనే 48 సంవత్సరాల మహిళను తన భర్త చాలా కాలంగా వేధిస్తున్నాడు. గొడవలు చేస్తున్నాడు. రోజు భార్యను తన్నడంతోనే అతని దినచర్య ప్రారంభం, ముగింపు ఉంటాయట.
ఆ భార్య చాలా కాలం భరించింది. భూదేవిలా ఓర్పుతో మెలిగింది. ఎవరికైనా సహనం కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది. హద్దులు దాటితే గుద్దులు పడాల్సిందే. ఇలానే చేసింది మారియా. కాకపోతే.. ఆమె పగలో వయలెన్స్ ఎక్కువైంది. రోజు ఇంటికి వచ్చి కొడుతున్న భర్త ఓ రోజు బాగా నిద్రలో ఉండగా.. కోపం తట్టుకోలేక కత్తితో భర్త అంగాన్ని కోసేసింది. దాన్ని కుక్కలకు ఆహారంగా వేసింది. అక్కడితో ఆగకుండా భర్త మెడను ఒక్కవేటుతో నరికిందట.
ఇంట్లో నుంచి పెద్దగా అరుపులు రావడంతో చుట్టుపక్కల ఉన్న జనాలు పరుగుపరుగున అక్కడికి వచ్చారు. భర్త నరికిన మారియా అక్కడే కూర్చొని ఉన్నది. వేంటనే పోలీసులకు సమాచారం అందించారు. తానే భర్తను చంపానని, రోజు ఇంటికి వచ్చి సంసారం పేరుతో హింసించేవాడని, అందుకే కోపంతో చంపేశానని చెప్పింది మారియా. చంపినట్టుగా ఒప్పుకోవడంతో ఆమెకు 15 సంవత్సరాల జైలు శిక్షను విధించింది కోర్టు.