చిదంబరం అధికారం ఉన్నప్పుడు విచ్చల విడిగా ప్రత్యర్థుల పైకి సీబీఐని పంపించేవారు. కానీ ఇప్పుడు చిదంబరం అదే సీబీఐ చేతిలో తీహార్ జైలుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే చిదంబరం పట్ల ఎవరు పెద్దగా సానుభూతి చూపించడం లేదు. ఎందుకంటే అధిరికంలో ఉన్నప్పుడు గర్వంతో ప్రత్యర్థులను ఇలానే జైలుకు పంపించారు. అప్పట్లో ఏపీ సీఎం జగన్ ను 16 నెలలు జైల్లో పెట్టించడంలో చిదంబరంకీలక పాత్ర పోషించాడని ఒక టాక్ కూడా ఉంది. సోనియా గాంధీని ఎదిరించినందుకు రాజకీయంగా జగన్ మీద కక్ష తీర్చుకున్నారు. అయితే ఇప్పుడు అదే చిదంబరంకు ఇప్పుడు జైల్లో చిప్పకూడు తినే రోజు వచ్చింది. చెడపకురా.. చెడేవే అని పెద్దలు ఊరకనే అనలేదు.


ఇలాంటి నీచమైన రాజకీయ నేతలు ఉంటారు కాబట్టే ఇటువంటి సామెతలు పుట్టాయి కాబోలు.  అయితే చిదంబరం 2017 నుంచి తప్పించుకుంటూ ఎన్నో స్టే లు తెప్పించుకున్నారు. చిదంబరం అతని కొడుకు కార్తీ. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చిదంబరం కేంద్ర మంత్రిగా పని చేసిన సంగతీ తెలిసిందే. అప్పుడే చిదంబరం .. కొడుకు కు లభ్ది చేకూర్చాలని పక్క దారిలో విదేశాల నుంచి డబ్బులు ఐఎన్ ఎక్స్ మీడియాలోకి వక్రమార్గంలో నిధులు తరలించారు.


స్వతహాగా సుప్రీం కోర్ట్ లాయర్ అయిన చిదంబరం అన్నీ జాగ్రత్తలు తీసుకోని స్కాం చేశారు. కానీ ఎంత జాగ్రత్తగా తప్పు చేసిన ఎక్కడో ఒక చోట దొరికిపోతారు. ఇప్పుడు అలానే చిదంబరం దొరికిపోయారు. అయితే చిదంబరం జైలు మెట్లు ఎక్కేసరికే జగన్ విషయంలో చిదంబరం చేసిన కక్ష సాధింపులన్నీ గుర్తుకు వచ్చి ఉంటాయి. అయితే చిదంబరం అరెస్ట్ పట్ల జగన్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. చిదంబరంకు ఇలా జరగాల్సిందేనని అందరూ అభిప్రాయ పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: