భారత్ లో దాడులకు ఉగ్రవాదులను పంపుతోంది పాకిస్థాన్. పిఒకె లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది. నియంత్రణ రేఖ దగ్గర ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం అరెస్టు చేసింది. మరోవైపు జమ్మూ కశ్మీరు వెళ్ళేందుకు మెహబూబా ముఫ్తీ కూతురికి అనుమతిచ్చింది సుప్రీం. జమ్ము కశ్మీర్ లడఖ్ ల అభివృద్ధికి రోడ్ మ్యాప్ తయారు చేసింది కేంద్రం. భారత్ లో అల్లకల్లోలం సృష్టించేందుకు తన పాత విధానాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది పాకిస్తాన్. ఏ క్షణమైనా భారత్ లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రవాదులకు ట్రైనింగ్ క్యాంప్ లను ఏర్పాటు చేసింది. పీవోకే లోని రావల్ కోట్ సిటీకి దగ్గరలో టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టింది.



జమాతే ఇస్లామీ ఉగ్రవాద సంస్థ నేతృత్వంలో ఈ క్యాంపులు సెట్ చేశారు. జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా లాంటి సంస్థలకు చెందిన దాదాపు పది వేల మంది ఉగ్రవాదులకు ఈ క్యాంప్ లో ట్రైనింగ్ ఇస్తున్నారని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆధ్వర్యంలో ట్రైనింగ్ జరుగుతోంది హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ షంషేర్ ఖాన్ ఈ క్యాంపులకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ నెల చివర్లో లేదంటే అక్టోబరు మొదట్లో భారత్ లోకి చొరబడేలా క్యాంపులు జరుగుతున్నాయి. కశ్మీర్ లో ఇద్దరు పాకిస్థానీ ఉగ్రవాదులను అరెస్టు చేసింది భారత సైన్యం. నియంత్రణ రేఖ దగ్గర అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఇద్దరు పాకిస్థానీ పౌరులను అదుపులోకి తీసుకొని విచారించింది సైన్యం.



వారిద్దరూ పాకిస్థాన్ లోని రావల్పిండికి చెందిన వారిగా గుర్తించింది సైన్యం. ఇద్దరు లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారని, భారత్ లో దాడులు చేసి అలజడి సృష్టించేందుకు ప్లాన్ చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఇక ఎల్ వోసీ దగ్గరకు బలగాలను తరలిస్తోంది పాకిస్తాన్. దాదాపు రెండు వేల మందికి పైగా సైనికులను పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని బాగ్, కోట్లి సెక్టార్ లలో నియంత్రణ రేఖకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంచిందని భారత సైన్యం తెలిపింది. పాక్ ఆర్మీ కదలికల్ని క్షుణ్ణంగా గమనిస్తున్నారని భారత సైనిక వర్గాలు తెలిపాయి. పీవోకే లో ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తున్న టైమ్ లోనే పాక్ సైన్యం బలగాలను తరలించడాన్ని విశ్లేషిస్తోంది ఇండియన్ ఆర్మీ. ఇక జమ్ము కశ్మీర్ లో మీడియాపై ఆంక్షలకు సంబంధించి ఈ నెల పదహారున విచారణ జరపనుంది సుప్రీంకోర్టు.



ఆంక్షలపై ఆర్డర్ పాస్ చేయటానికి చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ నిరాకరించింది. అనేక ప్రాంతాల్లోకి జర్నలిస్టుల్ని అనుమతించటం లేదని పిటిషనర్ల్ల్లు వాదించారు. పిటిషనర్ల వాదనను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యతిరేకించారు. కశ్మీర్ లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని ఎనభై శాతానికి పైగా ల్యాండ్ లైన్ లు పనిచేస్తున్నాయన్నారు అటార్నీ జనరల్ కేకే వేణు గోపాల్. మాజీ సీఎం పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తేజాకు శ్రీనగర్ వెళ్లేందుకు సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. చెన్నైలో ఉన్న ఇల్తేజా గృహ నిర్బంధంలో ఉన్న తన తల్లి మెహబూబాను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేయగా సుప్రీం అనుమతించింది.



అలాగే అనారోగ్యంతో ఉన్న కశ్మీర్ కు చెందిన సిపిఎం నేత యూసుఫ్ తరిగామిని ఢిల్లీ లోని ఎయిమ్స్ కు షిఫ్ట్ చేయాలని సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. ఇక ఆర్టికల్ 370 రద్దు చేసి నెల పూర్తయింది. దీంతో జమ్ము కశ్మీర్ లడఖ్ ల అభివృద్ధికి రోడ్ మ్యాప్ తయారు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. పది కేంద్ర మంత్రిత్వ శాఖలు కలిసి రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని నిర్ణయించాయి. అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి జమ్మూ కశ్మీర్, లడఖ్ లు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారనున్నాయి. రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక్కో బీఎస్ ఎఫ్, సీఆర్ పీఎఫ్ బెటాలియన్ లు ఇచ్చేందుకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: