రాజశేఖర్ రెడ్డి తనయుడిగా రాజకీయాల్లో అడుగు పెట్టి అత్యంత భారీ మెజారిటీతో రాష్ట్రంలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. అయితే చంద్రబాబుకు రాజశేఖర్ రెడ్డి పరిపాలనకు తేడా ఇట్టే చెప్పొచ్చు. రాజశేఖర్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పధకాలను చేరవేయడంలో ఎక్కువ ఫోకస్ చేస్తారు. కానీ చంద్రబాబు పాలన కార్పొరేట్ తరహాలో ఉంటుంది. అవన్నీ ప్రజలకు అర్ధం కావు. కొన్ని సార్లు ఉపయోగపడవు కూడా. గత ఐదేళ్లు బాబు పాలనా కార్పొరేట్ తరహాలో ఉండబట్టి అధికారానికి దూరం అయ్యారు. అయితే జగన్ మాత్రం తన తండ్రి ఏదైతే సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసి రెండో సారి కూడా అధికారంలోకి వచ్చారో జగన్ కూడా అదే ఫాలో అవుతున్నారు. ఫాలో అవ్వటం కాదు .. ఇంకా చెప్పాలంటే తన తండ్రి కంటే ఇంకా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. 


 ఇచ్చిన మాటను తప్పడం .. మడమ తిప్పకపోవటం రాజన్న స్టైల్ ఇప్పుడు జగన్ అదేఫాలో అవుతున్నారు. ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చిన హామీలు జగన్ వెంట వెంటనే అమలు చేస్తూ తాను మాట తప్పే వ్యక్తిని కాదని నిరూపిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత ప్రభుత్వం అయిన టీడీపీ .. ఉద్యోగులను మభ్య పెట్టి చివరికి వారికీ హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి.


చంద్రబాబు వారిని పట్టించుకోకుండా ఐదేళ్లు గడిపేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే అదనపు ఆర్ధిక భారం పడుతుందని బాబు భావించి ఆ దిశగా ఎన్నడూ ఆలోచించలేదు. కానీ ఇప్పుడు జగన్ సర్కార్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి క్యాబినెట్ ముద్ర కూడా వేసింది. దీనితో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఎక్కడ లేని ఆనందం వ్యక్తం అవుతుంది. ఇలా ఒకటి ఏంటి ఇప్పటివరకు మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని డేట్ ను కూడా అనౌన్స్ చేసి మరీ అమలు చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. అయితే జగన్  సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన రెండు నెలలు కాకముందే మొదటి అసీంబ్లీలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన పరిపాలన ఎలా ఉండబోతుందో మొదటి రెండు నెలల్లో అర్ధం అయ్యే విధంగా రాష్ట్ర ప్రజలకు చూపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: