చంద్రుని  ఫైకి చేరుకోవాలని  ఇస్రో చేసిన ప్రయోగం  అడుగు దూరంలో నిలిచిపోయింది. చంద్రుని కి రెండు కోలోమీటర్ల  దూరంలో  ఉండగా  చంద్రయాన్  2 ల్యాండర్  విక్రమ్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో  ఈ ప్రయోగం అసంపూర్ణంగా మిగిలిపోయింది.  దాంతో యావత్ భారతావని తీవ్ర నిరాశలో మునిగిపోయింది.  కాగా ఇప్పటివరకు  రష్యా , అమెరికా ,చైనా  ఈ మూడు దేశాలు మాత్రమే చంద్రునిపై తమ వ్యోమ నౌకలను సురక్షితంగా దింపగలిగాయి. 


అయితే భారత్ అత్యంత సంక్లిష్టమైన  దక్షిణ ధ్రువం ద్వారా  చంద్రుడిని చేరుకొని ఎవరికి సాధ్యం కానీ  ఘనత ను సాధించాలనుకుంది.  కానీ చివరి నిమిషంలో ఆ ప్రయత్నానికి బ్రేక్ పడింది. అంత మాత్రానా  ఈప్రయోగం పూర్తిగా  విఫలం అయినట్లు కాదు. ల్యాండర్ విక్రమ్ చంద్రుడి మీద క్షేమంగా ల్యాండయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు.  కానీ అది చంద్రుడి మీద నుంచి సిగ్నల్ పంపితే కానీ ఆ విషయాన్ని నిర్ధారించడానికి వీలుపడదు. ఇక ఇస్రో  చేపట్టిన ఈ ప్రయోగం ఫై ప్రపంచ వ్యాప్తంగా  ప్రశంసలు కురుస్తున్నాయి.  అందులో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ  నాసా ,ఇస్రో ప్రయత్నాన్ని అభినందించింది. 


జాబిలి ఫైకి  చేరుకోవడం  చాలా కష్టమైన పని... చంద్రయాన్ 2 ద్వారా  అక్కడ కాలు మోపాలని ఇస్రో చేసిన ప్రయత్నం అద్భుతం. మీ ప్రయోగం మాలో స్ఫూర్తినింపింది.   సౌర కుటుంభ పరిశోధనల్లో  మనిద్దరి మధ్య  పరస్పర సహకారం అందిపుచ్చుకునేందుకు  ఈ ప్రయోగం అవకాశం కల్పించింది  అని  నాసా ట్వీట్ చేసింది. 




మరింత సమాచారం తెలుసుకోండి: