అయితే భారత్ అత్యంత సంక్లిష్టమైన దక్షిణ ధ్రువం ద్వారా చంద్రుడిని చేరుకొని ఎవరికి సాధ్యం కానీ ఘనత ను సాధించాలనుకుంది. కానీ చివరి నిమిషంలో ఆ ప్రయత్నానికి బ్రేక్ పడింది. అంత మాత్రానా ఈప్రయోగం పూర్తిగా విఫలం అయినట్లు కాదు. ల్యాండర్ విక్రమ్ చంద్రుడి మీద క్షేమంగా ల్యాండయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. కానీ అది చంద్రుడి మీద నుంచి సిగ్నల్ పంపితే కానీ ఆ విషయాన్ని నిర్ధారించడానికి వీలుపడదు. ఇక ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం ఫై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. అందులో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ,ఇస్రో ప్రయత్నాన్ని అభినందించింది.
జాబిలి ఫైకి చేరుకోవడం చాలా కష్టమైన పని... చంద్రయాన్ 2 ద్వారా అక్కడ కాలు మోపాలని ఇస్రో చేసిన ప్రయత్నం అద్భుతం. మీ ప్రయోగం మాలో స్ఫూర్తినింపింది. సౌర కుటుంభ పరిశోధనల్లో మనిద్దరి మధ్య పరస్పర సహకారం అందిపుచ్చుకునేందుకు ఈ ప్రయోగం అవకాశం కల్పించింది అని నాసా ట్వీట్ చేసింది.
Space is hard. We commend https://twitter.com/isro?ref_src=twsrc%5Etfw">@ISRO’s attempt to land their https://twitter.com/hashtag/Chandrayaan2?src=hash&ref_src=twsrc%5Etfw">#Chandrayaan2 mission on the Moon’s South Pole. You have inspired us with your journey and look forward to future opportunities to explore our solar system together. https://t.co/pKzzo9FDLL">https://t.co/pKzzo9FDLL
— NASA (@NASA) https://twitter.com/NASA/status/1170385925077131264?ref_src=twsrc%5Etfw">September 7, 2019