చంద్రబాబు, లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదిక గా తీవ్రస్థాయి లో వరుస ట్వీట్లతో మండిపడ్డారు.


మాలోకం ఆయన టీమ్ ఉన్మాదం తో రెచ్చిపోతున్నారని విమర్శించారు పేదలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలన్న ఆశయంతో పైలెట్ ప్రాజెక్టు ను సీఎం జగన్ శ్రీకాకుళం నుంచి ప్రారంభిస్తే ఆ బస్తాల్లో నీళ్లు పోసి గడ్డగట్టిన బియ్యం ఇస్తారా అంటూ గంట లోపలే క్షుద్ర దాడి మొదలు పెట్టారు పచ్చ దొంగలు అంటూ విజయసాయి దుమ్మెత్తిపోశారు. 

ఉద్దానం చుట్టు అద్దె విమానాల్లో ఎగిరిన వ్యక్తే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూడలేక కళ్లుమూసుకున్నాడని   ఆరోపించారు పేదలకు నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తే కూడా జీర్ణించుకో లేక పోతున్నారని, మూడు పూటలా ఇసుక బొక్కిన నోళ్ళకు రేషన్ బియ్యం నాణ్యత ఏం తెలుసు అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.




మరింత సమాచారం తెలుసుకోండి: