టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ఇటీవల మీడియా ముందు కంటే ట్విట్టర్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. రోజుకు మూడు పూటలా ఏదో ఒక అంశంపై ట్వీట్లు పెడుతుండటం.. వాటిని ఎల్లో మీడియా ప్రముఖంగా వార్తల్లో పెట్టడం జరిగిపోతోంది. అయితే ఈ ట్వీట్లకు వైసీపీ నుంచి కూడా బాగానే కౌంటర్లు పడుతున్నాయి.
తాజాగా
ఈ టీడీపీ- వైసీపీ
ట్వీట్ల యుద్ధానికి జగన్
కొత్త పథకం వేదికైంది.
ఇటీవల శ్రీకాకుళం
జిల్లాలో జగన్ పేదలకు నాణ్యమైన
బియ్యం అంటూ పైలట్ ప్రాజెక్టు
ప్రారంభించింది. దీనిపై
మొదటి రోజే టీడీపీ నేతలు,
ఎల్లో మీడియా విమర్శలు
ప్రారంభించాయి. దీంతో
ఈ విషయంపై వైయస్ఆర్సీపీ
ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
నారా లోకేష్, ఆయన
టీం ఉన్మాదంతో రెచ్చిపోతున్నారని
విమర్శించారు. పేద
వాళ్లు తినగలిగే బియ్యాన్ని
పంపిణీ చేస్తుంటే టీడీపీ
నేతలు ఓర్వలేకపోతున్నారని
ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాణ్యమైన బియ్యం అందించాలనే ఆశయంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తే.. బియ్యం బస్తాల్లో నీళ్లు పోసి గడ్డకట్టిన బియ్యం ఇచ్చారంటూ ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైయస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గంటలోపలే పచ్చ పార్టీ దొంగలు క్షుద్ర దాడి మొదలెట్టారని విమర్శించారు.
‘మాలోకం, ఆయన టీం ఉన్మాదంతో రెచ్చిపోతున్నారు. పేదలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలనే ఆశయంతో పైలట్ ప్రాజెక్టును సీఎం జగన్ శ్రీకాకుళం నుంచి ప్రారంభించారు. పచ్చపార్టీ దొంగలు ఆ బియ్యం బస్తాలలో నీళ్లు పోసి గడ్డకట్టిన బియ్యం ఇస్తారా అంటూ గంటలోపలే క్షుద్రదాడి మొదలు పెట్టారు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం నుంచి ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. ఆ జిల్లాలో 8,60,727 తెల్ల రేషన్ కార్డులు ఉండగా.. గ్రామ, వార్డు వలంటీర్లు శనివారం నాటికి 70 శాతానికి పైగా బియ్యం బ్యాగ్లను ఇంటింటికీ తీసుకెళ్లి పంపిణీ చేశారు.