తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని తమకు కావాల్సిన మనుషులకు పనులు సిఫారసు చేస్తూ పరపతిని పెంచుకుంటారు. అలాగే ఎన్నికలో ఖర్చు చేసిన డబ్బులను తిరిగి సంపాదించుకోలనుకుంటారు. కానీ ఇప్పుడు వైసీపీ మంత్రులకు గాని గెలిచిన ఎమ్మెల్యేలకు ఆ పరిస్థితి లేదు. జగన్ కు అందరికీ స్ట్రిక్ట్ గా చెప్పాల్సింది చెప్పారు. దీనితో మంత్రులు ఏం చేయలేక అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. జగన్ పెట్టిన నిఘా వ్యవస్థ వల్ల ఎమ్మెల్యేలు ఏం తప్పు చేసినా అడ్డంగా దొరికిపోతున్న పరిస్థితి. రాష్ట్రంలో సీఎం ఒక్కరే బాగా పని చేస్తే సరిపోదు. మంత్రులు కూడా బాగా పని చేస్తేనే ప్రజల్లో ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది.

గత ప్రభుత్వంలో మంత్రులు .. ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయిన చంద్ర బాబు పట్టించుకోనిపరిస్థితి. అయితే ఏపీ సీఎంగా జగన్ రాష్ట్రంలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజా సంక్షేమమే దిశగా తన పాలన ఉంటుందని .. తన ప్రభుత్వంలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తానని చెప్పారు. ఇప్పటీకే ఏ రాష్ట్రం చేపట్టిన విధంగా కాంట్రాక్టు పనులు అత్యంత పారదర్శకంగా ఉండేందుకు జ్యూడిషల్ కమీషన్ ను ఏర్పాటు చేస్తున్నారు.


ఇంకొక పక్క రివర్స్ టెండరింగ్ తీసుకువస్తున్నారు. అదే సమయంలో జగన్ .. తన మంత్రి వర్గానికి గట్టిగ హెచ్చరికలు చేశారు. తన ప్రభుత్వంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే నెక్స్ట్ మినిట్ క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదని చెప్పారు. ఇప్పటికే ఒక సెటిల్ మెంట్ లో దొరికిపోయిన మంత్రిని హెచ్చరించారు. జగన్ మంత్రుల మీద నిఘా పెట్టడానికి ఇంటెలిజెంట్ వ్యవస్థను పటిష్టం చేసారు. దీనితో మంత్రులు అందరూ జాగ్రత్తగా పని చేసినట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో ఇంటెలిజెంట్ వ్యవస్థను స్వయంగా తన మంత్రుల మీద పెట్టిన దాఖలాలు లేవు. టీడీపీ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతిలో మునిగి పోయారు. అయినా టీడీపీ అధినాయకత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు మూల్యం చెల్లించుకుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: