అధికారంలో ఉన్న ఐదేళ్ళు
గ్రాఫిక్స్ చూపించి ఇదే అమరావతి అంటూ జనాలను మోసం చేశారు. ప్రపంచంలోని ఐదు
అత్యద్భుత నగరాల్లో అమరావతి కూడా ఒకటంటూ
అసలు లేని నగరాన్ని ఉన్నట్లుగా అందరినీ భ్రమల్లో ముంచెత్తారు. ఓ నాలుగు నాసిరకం
కట్టడాలు కట్టి ఇదే అద్భుత రాజధాని అన్నారు. తాము చెప్పేదంతా జనాలు నమ్ముతున్నారని
అనుకున్నారు. తీరా ఎన్నికల్లో గూబ గుయ్యిమనిపించారు.
సీన్ కట్ చేస్తే ఎన్నికల్లో జనాలు కొట్టిన దెబ్బకు కళ్ళు బైర్లు కమ్మిన తర్వాత చంద్రబాబునాయుడు, పుత్రరత్నం నారా లోకేష్ ఇపుడు జగన్మోహన్ రెడ్డిపై పడి ఒకటే ఏడుస్తున్నారు. ఇంతకీ వాళ్ళ ఏడుపు ఏమిటయ్యా అంటే అమరావతి నిర్మాణం ఆపటానికి జగన్ కుట్రలు పన్నుతున్నారట. అధికారంలో ఉన్న వ్యక్తి అమరావతిని ఆపాలంటే కుట్రలు చేయటం ఎందుకు ? నేరుగానే ఆపేస్తారు కదా ?
ప్రజలందరూ కోరుకున్న రాజధాని నిర్మాణాన్ని ఆపే హక్కు మీకెవరిచ్చారు ? అంటూ విచిత్రమైన ప్రశ్న వేశారు లోకేష్. చంద్రబాబు, చినబాబు అనుకుంటున్న ఈ ప్రాంతంలోనే రాజధానిని కట్టమని ఏ ప్రజలడిగారు ? పలానా ప్రాంతంలో రాజధానిని కడుతున్నట్లు చంద్రబాబేమన్నా జనాభిప్రాయం సేకరించారా ? ఏదో నలుగురితో తెరవెనుక కూర్చుని మాట్లాడేసుకుని నిర్ణయాన్ని ప్రకటించారంతే.
రాష్ట్ర ప్రజల కోసం అద్భుత రాజధానిని అక్కర్లేదని దుర్మార్గపు ఆలోచన ఎందుకు చేస్తున్నట్లు ? అంటూ ప్రశ్నించేశారు. నిజానికి తమ హయాంలోనే కట్టే అద్భుత రాజధానేదో కట్టేసుంటే ఇపుడీ ఏడుపులు అవసరం ఉండేది కాదు కదా ? అంటే చంద్రబాబు, చినబాబు ఉద్దేశ్యంలో జగన్ కూడా రాజధాని నిర్మించకుండా తమకు లాగే జనాలను భ్రమల్లో ఉంచి మోసం చేయాలని ఉన్నట్లుంది చూస్తుంటే. రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగకూడదు, పెట్టుబడులు రాకూడదు, సంక్షేమపథకాలు అమలు కాకూడదు అన్నట్లుంది అబ్బా, కొడుకుల ఆలోచన