అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వ్యక్తి ఉదంతం సంచలనం రేపింది. భార్యను అనుమానంతో వేధించడమే కాకుండా విడాకులు కోరిందన్న కారణంతో భార్యపై కక్షగట్టాడు ఓ ప్రబుద్ధుడు.  తన నగ్న ఫోటోలను సోషల్‌మీడియాలో పెట్టి మానసికంగా వేధించడంతో పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళ. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

 

 

హర్యానాకు చెందిన ఓ వ్యక్తి గుర్‌గావ్‌లో నివసిస్తూ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సదరు మహిళతో ఈ వ్యక్తికి 12ఏళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలం పాటు అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో అనుమానం చిచ్చు రేగింది. దీంతో తన భార్యను ప్రతీ విషయంలోనూ అనుమానిస్తూ హింసకు గురిచేశాడు. భర్త ప్రతి చిన్న విషయానికి అనుమానిస్తూ గొడవ పెట్టుకోవడంతో విసిగిపోయిన ఆమె.. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ ప్రస్తుతం విచారణలో ఉంది. అయితే.. భార్య తన నుంచి విడాకులు కోరడాన్ని సహించలేక ఆమెపై వ్యక్తిగత కక్షకు దిగాడు. గతంలో భార్యతో తాను వ్యక్తిగతంగా దిగిన ఫోటోలను, ఆమె నగ్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టుచేస్తూ అసభ్య కామెంట్లు చేయడం మొదలుపెట్టాడు. ఇవి విస్తృతమై ఆమె స్నేహితుల వరకూ చేరాయి. దీంతో స్నేహితులు ఈ విషయాన్ని బాధితురాలికి చేరవేశారు. వెంటనే ఆమె మానేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన నగ్న చిత్రాలు సోషల్‌మీడియాలో పోస్టుచేస్తూ భర్త వేధింపులకు పాల్పడుతున్నాడని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. 

 

 

 

బాధితురాలి ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు ఈ కేసును స్వీకరించి సైబర్‌క్రైమ్ విభాగానికి బదిలీ చేశారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. ఈ ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాత నిందితుడిపై తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: