ఉగ్రవాదానికి వ్యతిరేకం అంటూనే ఉగ్ర సామ్రాజ్యాన్ని పెంచి పోషిస్తోంది పాకిస్థాన్. జైలులో ఖైదీగా ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ ను విడుదల చేసింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు దిశానిర్థేశం చేయడానికి రెండురోజుల క్రితం మసూద్ను రహస్యంగా విడుదల చేశారని ఐబీ పేర్కొంది. జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత భారత్ను భారీ దెబ్బతీయాలనే కుట్రతో ఆ దేశం పావులు కదుపుతోన్నట్లు సమాచారం.
పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి చూపించుకుంది. ఉగ్రవాదాన్ని ఏరివేస్తున్నామంటున్న ఇమ్రాన్ వ్యాఖ్యలు కేవలం మాటలకు మాత్రమేనని తేటతెల్లమైంది. కరుడుగట్టిన ఉగ్రనేతః.. జైషే మహమ్మద్ చీఫ్ను విడుదల చేసింది. ఇటీవల కొద్ది రోజుల క్రితం మసూద్ను అరెస్టు చేసినట్లు ప్రకటించిన పాకిస్థాన్.. ఆ వెంటనే యూటర్న్ తీసుకుని.. తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. ప్రపంచ దేశాల ముందు టెర్రరిజాన్ని అంతం చేస్తున్నట్టు నటిస్తోంది. కానీ ఉగ్ర సంస్థల అధినేతల పట్ల మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతోంది. జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజహర్ను విడుదల చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి అప్రమత్తంగా ఉండాలని ఐబీ హెచ్చరికలు జారీ చేసింది.
రాజస్థాన్—కశ్మీర్ సెక్టార్లలో అలజడి సృష్టించేందుకు పాక్ కుట్రలు పన్నుతోందని ఐబీ తెలిపింది. జమ్ముకశ్మీర్ విషయంలో కేంద్రం ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత.. భారత్, పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో పాక్ భారత్పై ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ.. కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అయితే పాక్ కుట్రలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. తాజాగా మసూద్ అజార్ని విడుదల చేశారన్న వార్తల తరుణంలో.. రాజస్థాన్ సరిహద్దుల్లో భారీ స్థాయిలో పాక్ ఆర్మీని మొహరించినట్టు తెలుస్తోంది. దీంతో భారత ఆర్మీ కూడా అలర్ట్ అయ్యింది.
కాగా ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. భారత్లో మరోసారి అలజడి సృష్టించేందుకు పాక్ కుట్రలు పన్నుతోందని అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ను రహస్యంగా విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద సంస్థలకు భారత్లో దాడులకు ప్లాన్లు వేయడానికే మసూద్ను వదిలిపెట్టినట్లు ఐబీ తెలిపింది.