కాంగ్రెస్ సీనియర్ నేత .. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్ట్ అయ్యి ఇప్పుడు తీహార్ జైల్లో ఉన్న సంగతీ తెలిసిందే. అయితే చిదంబరంను అరెస్ట్ చేస్తే ఆ కేసులో అధికారులకు కూడా పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఇదే విషయంలో చిదంబరం చెబుతూ ఈ కేసులో అధికారులను అరెస్ట్ చెయ్యొద్దని .. ట్విట్టర్ లో ఈ విషయం చెప్పాలని తన కుటుంబానికి చెప్పినట్టు సమాచారం. అయితే చిదంబరంకి తీహార్ జైల్లో మిగతా ఖైదీల మాదిరి అదే సౌకర్యాలు కల్పిస్తున్నారు. తీహార్ జైలులో చిదంబరంకు సెల్ నెం. 7 ను కేటాయించారు. ఇందులో ఆర్ధిక నేరగాళ్లు ఉంటారు. మిగతా ఖైదీలకు ఉండే సదుపాయాలు మాత్రమే చిదంబరంకు ఉంటాయని .. పప్పు .. 4 చపాతీలు చిన్న బౌల్ లో ఇస్తామని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు.


అతనికి సౌత్ ఇండియా ఫుడ్ కావాలంటే సెపరేట్ గా స్నాక్స్ అందుబాటులో ఉంచుతామని అది కూడా కోర్ట్ ఆర్డర్ ప్రకారమని చెబుతున్నారు. తీహార్ జైలులో చిదంబరంకు సెల్ నెం. 7 ను కేటాయించబోతున్నారు. ఇందులో ఆర్ధిక నేరగాళ్లు ఉంటారు. మిగతా ఖైదీలకు ఉండే సదుపాయాలు మాత్రమే చిదంబరంకు ఉంటాయని .. పప్పు .. 4 చపాతీలు చిన్న బౌల్ లో ఇస్తామని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు. అతనికి సౌత్ ఇండియా ఫుడ్ కావాలంటే సెపరేట్ గా స్నాక్స్ అందుబాటులో ఉంచుతామని అది కూడా కోర్ట్ ఆర్డర్ ప్రకారమని చెబుతున్నారు. 

అలాగే జైల్లో చిదంబరంకు మంచం అది కూడా పరుపు లేకుండా ఉండేది మాత్రమే ఇస్తామని చెప్పుకొచ్చారు. సీనియర్ సిటిజన్స్ కు మాత్రమే ఇటువంటివి ఉంటాయి. మిగతా వారు అయితే కిందే పడుకోవాల్సిందేనని చెప్పారు. అయితే పరిస్థితి చూస్తుంటే చిదంబరంకు బెయిల్ వచ్చేది కష్టంగా మారింది. కేంద్రం కూడా చిదంబరం కేసును చాలా సీరియస్ గా తీసుకుంది. ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరంను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడినట్టు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు.




మరింత సమాచారం తెలుసుకోండి: