టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైయస్ఆర్సిపి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటనలు టిడిపి నాయకులను లక్ష్యంగా చేసుకున్నాయని చెప్పారు. టిడిపి గుంటూరులో పునరావాస శిబిరాన్ని కూడా ప్రారంభించింది. పల్నాడులో చాలా కుటుంబాలు తమ ఇళ్లను విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు.
గుంటూరులో 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంతో గుంపులుగుంపులుగా వెళ్లడం లేదా ఊరేగింపులో ప్రకటనలు బహిరంగంగా సాధ్యంకాదని, అటువంటి ఆలోచనలు ఉంటే టిడిపి మానుకోవాలని హెచ్చరించారు. గణేష్ ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకోవడం వల్ల శాంతిభద్రతలు కు అపాయం కలగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకులకు కూడా శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఉంది అని, పోలీసులకు సహకరించకుండా ఇలా రెచ్చగొట్టే పనులకు దిగకూడదు అని సూచించారు. అలా లేని పక్షంలో కూడా అన్ని విధాలుగా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉంది అని విశ్వాసాన్ని తెలిపారు.