ఉన్నత విద్యా అవకాశాలకు సుపరిచితమైన దేశాల్లో ఒకటైన బ్రిటన్లో కీలక మార్పులు తెరమీదకు వస్తున్నాయి. ఆస్ర్టేలియాలో ప్రస్తుతం ఉన్న ‘పాయింట్స్ బేస్డ్ ఇమిగ్రేషన్సిస్టమ్’ను అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తమ వీసా విధానంలో మార్పులు చేసేందుకు బ్రిటన్ ప్రతిపాదనలు రెడీ చేస్తోంది.వీసాకు దరఖాస్తు చేసే వ్యక్తి నైపుణ్య స్థాయిని బట్టి ఇంగ్లీష్ స్కిల్స్కు ర్యాంకులు ఇవ్వనున్నారు.ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీతో పాటు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్.. తదితర అంశాలను కొత్త ఇమిగ్రేషన్ సిస్టమ్లో పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు విధివిధానాలను యూకే హోం సెక్రెటరీ ప్రీతి పటేల్ ఫైనలైజ్ చేస్తున్నారు.
ఇటీవల విధించిన గడువు ప్రకారం యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి అక్టోబర్31లోగా బ్రిటన్ బయటికి రావాల్సి ఉంది. తాజా ప్రతిపాదనల ప్రకారం, ఆస్ట్రేలియా పాయింట్ల సిస్టమ్ ప్రకారం.. ‘సుపీరియర్ ఇంగ్లీష్’ ఉన్న స్కిల్డ్ మైగ్రెంట్లకు 20 పాయింట్లు ఇస్తున్నారు. అయితే ఇందుకు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఏదైనా ల్యాంగ్వేజీ టెస్టులో 8 లేదా అంతకన్నా ఎక్కువ స్కోర్ సాధించాలి. తర్వాత 7 మార్కులు సాధించిన ‘ప్రొఫిసియెంట్ ఇంగ్లిష్’ మైగ్రెంట్లకు 10 పాయింట్లు ఇస్తున్నారు. ‘కంపీటెంట్ ఇంగ్లీష్’ కలిగిన వారికి మాత్రం ఎలాంటి పాయింట్లు రావు.
కాగా, బ్రిటన్కొత్త ప్రధాన మంత్రిగా లండన్ మాజీ మేయర్, బ్రెగ్జిట్కు హార్డ్కోర్ సపోర్టర్ అయిన బోరిస్జాన్సన్ అధికార పగ్గాలు చేపట్టారు. రూలింగ్ కన్సర్వేటివ్పార్టీ లీడర్షిప్కోసం జరిగిన ఎన్నికల్లో జాన్సన్ ఘన విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి, ప్రస్తుత విదేశాంగ మంత్రి జెరెమీ హంట్ కు 46,656 ఓట్లు రాగా, జాన్సన్కు 92,153 ఓట్లు పడ్డాయి. దీంతో బ్రిటన్కన్సర్వేటివ్ పార్టీ లీడర్గా, తద్వారా ప్రధానిగా జాన్సన్నియామకం ఖరారు అయింది. బ్రెగ్జిట్(యూరోపియన్యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వెళ్లేందుకు)కు జాన్సన్ మొదటి నుంచీ గట్టిగా మద్దతు తెలుపుతున్నారు. తనను ప్రధానిని చేస్తే.. వేర్పాటు ఒప్పందం లేకుండా లేదంటే ఏదో ఒక డీల్ తో అయినా.. బ్రెగ్జిట్ సాధిస్తానని, అక్టోబరు 31 డెడ్లైన్నాటికి బ్రిటన్ను తప్పకుండా యూరోపియన్యూనియన్నుంచి బయటకు తీసుకొస్తానని జాన్సన్ హామీ ఇచ్చారు. బ్రెగ్జిట్పై 2016లో రెఫరెండం నిర్వహించగా, ఎక్కువమంది ప్రజలు యూరోపియన్యూనియన్నుంచి బయటకు రావాలనే కోరుకున్నారు. తర్వాత పరిణామాల నేపథ్యంలో బ్రెగ్జిట్ పై ఎటూ తేల్చుకోలేని విధంగాసంక్షోభం ఏర్పడటంతో ప్రస్తుత ప్రధాని థెరెసా మే జూన్ 7న రాజీనామా చేశారు.