ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి  పరిపాలనపై  పట్టు కోల్పోయారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రజలు మంచి మార్పు కోరుకుని జగన్ కు అవకాశం ఇచ్చారని చెప్పారు. కానీ జగన్ గతంలో చెప్పిన మాటలకు చేస్తున్న పనులకు పొంతన లేకుండా పోయిందని చెప్పారు. తన పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వడంపై పెట్టిన శ్రద్ధ భవన నిర్మాణ కార్మికుల ఆకలి కేకలు పై లేకపోయిందని విమర్శించారు. ఇసుక మాఫియా అరికడతామని చెప్పి కొత్త పాలసీ పేరుతో ఇసుక దొరక్కుండా చేసారని విమర్శించారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు అనుభవం చూసి ప్రజలు తెదేపాకు అవకాశం ఇచ్చారు. అయితే ఆయన తన అనుభవాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం కోసం వాడారు. ఆర్భాటాలకు చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. గడచిన ఐదేళ్లలో చంద్రబాబు చేసిన తప్పులు ఎత్తి చూపి జగన్ ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించారు. తెదేపా వాళ్లు అరాచకాలు చేశారు కాబట్టే వాళ్లను ప్రజలు ఓడించారన్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక వ్యక్తులు మారటం తప్ప వ్యవస్థ అలాగే ఉందని ఆరోపించారు.



జన్మభూమి కమిటీల మాదిరిగా గ్రామ వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. అది కేవలం పార్టీ కార్యకర్తలకు ఉపాధి మాత్రమేనన్నారు. అవి ప్రభుత్వ ఉద్యోగాలైతే ఎందుకు రాత పరీక్ష నిర్వహించలేదు, ఎందుకు రిజర్వేషన్లు పాటించలేదని  నిలదీశారు. ప్రభుత్వంపై అదనపు భారం పడే నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి అవకాశం లేకుండా చేస్తున్నారు. రైతులకు 12 వేల పెట్టుబడి నిధి ఇస్తామని చెప్పి దానికి ఇపుడు కేంద్రం ఇచ్చే డబ్బులు కలిపారు. చంద్రబాబు  పోలవరం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా మార్చారన్నారు. చంద్రబాబు మాదిరిగా మీరు కూడా రాయలసీమ ప్రాజెక్టులను పట్టించుకోలేదు. అవినీతిని భూతంలా చూపి రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారు. ఇప్పటికీ ఇసుక దొరకడం లేదు.. ఆన్ లైన్ విధానం పని చేయటం లేదన్నారు. ప్రజలను ఇబ్బందులు పెట్టటమే పనిగా పెట్టుకున్నారు. వరదలు వస్తే నీటి నిర్వహణ చేయకుండా ముఖ్యమంత్రి అమెరికా వెళ్లారు. రాయలసీమలో తాగునీరు కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి ప్రాజెక్టులు పూర్తిగా నింపటంపై దృష్టి లేదు. వ్యక్తులు మారడం తప్ప వ్యవస్థ ఏమీ మారలేదు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా మార్చారు. చంద్రబాబు మాదిరిగా మీరు కూడా రాయలసీమ ప్రాజెక్టులను పట్టించుకోలేదు. అవినీతిని భూతంలా చూపి రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారు.




అసలు అవినీతిపరులను వదిలేసి మీ ప్రతాపం అంతా దళితులు, రేషన్ డీలర్లు, తాత్కాలిక ఉద్యోగులపై చూపిస్తున్నారు. మీరు కల్పించిన ఉద్యోగాల కంటే.. ఎక్కువ మందిని రోడ్డున పడేశారు. ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసేలా వైకాపా ప్రభుత్వ చర్యలు పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరిచ్చారు. రాష్ట్రంలో ఒక మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. మూడు నెలల్లోనే ఈ ప్రభుత్వం ఓ మతానికి అనుకూలమనే భావన ఏర్పడింది. సెక్యులర్ దేశంలో అన్ని మతాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైసీపీ ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత పడాలని హెచ్చరిస్తున్నా. మీరు తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. ఉపాధి హామీ క్రింద గత మూడు నెలల్లో 18 వందల కోట్లు కేంద్రం ఇచ్చింది. కానీ పాత బకాయిలు కూడా ఇంకా చెల్లించలేదు. వంద రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ఒక్కటైనా చెప్పగలరా నిలదీశారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలనే నిర్ణయంతో  పారిశ్రామికీకరణకు అవరోధం ఏర్పడిందన్నారు.  అవగాహన రాహిత్యంతో రాష్ట్రం మరింత అద:పాతాళానికి పోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికైనా మీరు తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాల్సీన అవసరం ఉందన్నారు.




గతంలో వైయస్ అధికారంలోకి వచ్చినపుడు ఇలా చేయలేదు. అన్ని వర్గాల వారిని కలుపుకొని వెళ్లాలి. బిజెపి నేతల నాలుకలు చీరేస్తామని కొందరు మాట్లాడుతున్నారు. తమరి వైఖరి గురించి  తెలుసే 2014లో ప్రజలకు అధికారం ఇవ్వలేదన్నారు. చంద్రబాబు అరాచకాలు చూసి మీకు అధికారం ఇస్తే... మీరు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. దేవాలయ భూములు పంపిణీ చేయటానికి వాళ్ల తాత సొమ్ము కాదని మండిపడ్డారు. ఆలయాల పరిరక్షణ కోసం దాతలు ఇచ్చిన భూములు అప్పనంగా ఇస్తారా అని ప్రశ్నించారు . సదావర్తి భూములు అక్రమంగా కట్టబెట్టడితే చర్యలు తీసుకోవాలన్నారు. తమ కార్యకర్తలపైనా జరుగుతున్న దాడులకు నిరసనగా ఈనెల 16న బిజెపి ఆధ్వర్యంలో ధర్నా చేయబోతున్నామని చెప్పారు. బిజెపిలో చేరిన వారిని వేధిస్తున్నారన్నారు. తాను రాసిన లేఖలకు ఒక్కదానికి సమాధానం లేదన్నారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు తురగా నాగభూషణం, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  గండవరపు జగన్మోహన్ ప్రభాకర్, అధికారప్రతినిధి క్రోసూరు వెంకట్, రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: