‘చలో ఆత్మకూరు’ సందర్భంగా టీడీపీ నాయకులు అత్యుత్సాహం చూపుతున్నారు. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నప్పటికీ రాజధాని ప్రాంతంలో హల్‌చల్‌ చేస్తూ ఉద్రిక్తతలు పెంచుతున్నారు. అడ్డుకుంటున్న పోలీసులపై విచక్షణారహితంగా విరుచుకుపడుతున్నారు అంతే కాకుండా అధికార పార్టీ నాయకులపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆత్మకూరు పేరిట పచ్చనేతలు అధికార పక్ష నేతలపైన రెచ్చిపోతున్నారు.  ఈ  క్రమంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనపై వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు చేస్తున్న ఆరోపణలపైన  స్పందించారు పుల్లారావు. దళితులు వద్ద  కొన్న భూమిపై పదేపదే  ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. 



ఈ ప్రమాణాన్ని  చేయడానికైనా  తాను సిద్ధమని స్పష్టం చేసారు.  నీవు సిద్ధమా అని ఎమ్మెల్యే బ్రాహ్మణయుడ్ని ప్రశ్నించారు. ఆయన చేస్తున్న నిరాధారణమైన  ఆరోపణలు చేస్తున్న  బొల్లాపై  పరువు నష్టం దావా వేయనున్నట్లు పుల్లలారావు మీడియాకు తెలిపారు. దేనికైనా ఐయామ్ రెడీ..ఎప్పుడైనా రా.. ప్రమాణం చేద్దాం...లేదా డెఫిర్మషన్ వేస్తానని స్పష్టం చేశారు. మరో పక్క  నన్నపనేని రాజకుమారి నోరు పారేసుకున్నారు. సాటి మహిళ అని కూడా చూకుండా టీడీపీ మహిళా నాయకులు దూషణకు దిగడంతో మహిళా ఎస్‌ఐ ఒకరు మనస్తాపం చెంది విధుల నుంచి వెళ్లిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.




‘దళితుల వల్లనే దరిద్రం’ అంటూ అక్కడే విధుల్లో ఉన్న దళిత మహిళా ఎస్‌ఐ అనురాధపై నన్నపనేని నోరు పారేసుకున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలతో కలత చెందిన ఎస్‌ఐ అనురాధ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేగా, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా పనిచేసిన నన్నపనేని ఎలా మాట్లాడడం సరికాదని అన్నారు.తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకురాళ్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. అంతకుముందు చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు పోలీసు ఉన్నతాధికారిని దుర్భాషలాడారు. కాగా, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా మహిళా ఎస్‌ఐతో దురుసుగా ప్రవర్తించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: