ముచ్చ‌ట‌గా మూడుసార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం.. మూడు సార్లు ప్ర‌తిప‌క్ష నేత‌గా ప‌నిచేసిన రాజ‌కీయ నేత‌గా రికార్డు.. అదే సంద‌ర్భంలో అక్ర‌మ మార్గంలో అధికారం చేప‌ట్టిన అప‌వాదు త‌న‌పేరుమీదే ఉన్న రికార్డు.. ఇన్ని రికార్డులు, ఎంతో రాజకీయ ట్రాక్ రికార్డులు ఉన్న టీడీపీ ఆధినేత చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో ఆయ‌నకు ఉన్న ప‌రువు కాస్తా కృష్ణార్ప‌ణం అయింది అనే టాక్ ఇప్పుడు రాజ‌కీయ స‌ర్కిల్స్‌లో వినిపిస్తుంది. ఎందుకు చంద్రబాబు త‌న ప‌రువును కృష్ణా న‌దిలో క‌లుపుకుంటున్నారో అంటే..


ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు కొడుకు వ‌య‌స్సు. త‌న కొడుకంత‌టి వ‌య‌స్సున్న వ్య‌క్తితో రాజ‌కీయంగా పోటీకి దిగి దిగ‌జారుడు విమ‌ర్శ‌లు చేసి ఘోర ప‌రాజ‌యం పొందిన‌పుడే చంద్రబాబు ప‌రువు బ‌జారున ప‌డ్డ‌ది. సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌మాణం స్వీకారం చేస్తే తాను ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉండ‌టం ఆయ‌న చేసిన మ‌రో ఘోర త‌ప్పిదం. ఇక స్పీక‌ర్ ఎన్నిక రోజున చంద్ర‌బాబు చేసిన నిర్వాకంతో ఆయ‌న పెద్ద‌రికం గంగ‌పాలైంది. త‌రువాత చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణ‌యాలు ఇప్పుడు ఆయ‌న ప‌త‌నాన్ని చూపెడుతున్నాయి..


చంద్రబాబు అధికారంలో ఉన్న‌ప్పుడు త‌న బినామీల‌కు ప‌ద‌వుల పందేరం వేయ‌డంతో వారి ఆగ‌డాల‌కు అంతే లేకుండా పోయింది. అధికారం ఉంది క‌దా అని విచ్చ‌ల‌విడిగా అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారు. అనేక దుర్మార్గ‌మైన దుశ్చ‌ర్య‌ల‌కు దిగారు. దాడులు, దౌర్జ‌న్యాలు, హ‌త్య‌లు, లూటీలు చేశారు. అయినా చంద్ర‌బాబు వారిని ఏనాడు మంద‌లించిన పాపాన పోలేదు. దీంతో టీడీపీ పుట్టిమునిగింది.. ఎన్నిక‌ల్లో నిండా మునిగింది. ఇప్పుడు అధికారం కొల్పోవ‌డంతో అస‌హానానికి గురైన చంద్ర‌బాబు కుటిల రాజ‌కీయాల‌కు తెర‌లేపాడు. అందులో భాగంగానే త‌న అక్ర‌మాలు, టీడీపీ నేత‌ల అక్ర‌మాలు బ‌య‌ట‌కు రాకుండా ఏమి చేయాలో.. ఏమీ చేయ‌కూడ‌దో అన్ని ప‌నులు చేస్తున్నారు.


అందుకే రాజ‌ధాని భూముల పేరుతో టీడీపీ నేత‌లు సాగించిన అక్ర‌మాలు బ‌య‌టికి వ‌స్తాయ‌నే భ‌యంతో వైసీపీ ఎక్క‌డ రాజ‌ధానిని మార్చుతారోన‌ని గ‌గ్గోలు పెడుతున్నాడు. రాజ‌ధాని విష‌యాన్ని బీజేపీలోని త‌న బినామిల‌తో రాద్దాంతం చేయిస్తున్నాడు. ఇక రాజ‌ధాని భూముల వ్య‌వ‌హారం మెడ‌కు చుట్టుకోకుండా జాగ్ర‌త్త ప‌డుతున్న చంద్ర‌బాబు అడ్డ‌గోలు ఆందోళ‌న‌తో ప‌రువు బ‌జారున ప‌డేసుకున్నాడు. చంద్రబాబు వ్య‌వ‌హారం చూస్తే అక్ర‌మాలు రాజ‌ధానిలో జ‌రిగాయ‌నే అనుమానాలు స‌గ‌టు జ‌నాల‌కు క‌లుగుతున్నాయి. ఇక తాను ఐదేండ్లు అధికారం అనుభ‌వించి కూడా సొంతంగా ఏపీలో ఇల్లు క‌ట్టుకొని ఉండ‌లేని స్థితికి దిగ‌జారిన చంద్రబాబు, ఏకంగా కృష్ణ క‌ర‌క‌ట్ట‌పై అక్ర‌మంగా వెలిసిన ఇంట్లో ఐదేండ్లు కాపురం చేసి విమ‌ర్శ‌ల పాల‌య్యాడు.


ఇక టీడీపీ నేత‌లు కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కుటుంబం సాగించిన అక్ర‌మాలు, దౌర్జ‌న్యాలు అంతా ఇంతా కావు. అదే విధంగా చూసుకుంటే య‌ర‌ప‌తినేని అక్ర‌మ మైనింగ్ వ్య‌వ‌హారం, మాజీ మంత్రులు నారాయ‌ణ‌, గంటా శ్రీ‌నివాస‌రావు, మాజీ ఎంపి ముర‌ళీమోహ‌న్ వంటి వారి అక్ర‌మాలు బ‌య‌ట‌కు రాకుండా చంద్రబాబు ఇప్పుడు అత్మ‌కూరు డ్రామా ఆడుతున్నాడ‌ని అంద‌రు అనుమాన ప‌డుతున్నారు. టీడీపీ నేత‌ల అక్ర‌మాల‌ను వైసీపీ ప్ర‌భుత్వం ఎక్క‌డ వెలికితీస్తుందో అనే భ‌యంతోనే గ‌తంలో పోరాటాల పేరుతో చేస్తున్న కుటిల డ్రామాల‌కు పెట్టింది పేరు చంద్రబాబు. చంద్రబాబు అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక్క‌రిపైనా కూడా దాడులు చేయ‌న‌ట్టుగా ఓ ఫోజు కొడుతున్నాడు.


వాస్త‌వానికి ఆత్మ‌కూరు, ప‌ల్నాడు ప్రాంతంలో దాడులు దౌర్జ‌న్యాలు అనేవి కేవ‌లం జ‌గ‌న్ సీఎం అయినాక అవుతున్న‌వి కావ‌న్న స‌త్యం బాబుకు తెలుసు. అక్క‌డ ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న కాలంలో కూడా దాడులు జ‌రిగిన‌ట్లు రుజువులు ఉన్నాయ‌ని తెలుస్తుంది. మ‌రి చంద్రబాబు ఈ విష‌యాన్ని ఎందుకు రాద్దాంతం చేస్తున్నాడంటే పోల‌వ‌రం, అమ‌రావ‌తి, టీడీపీ నేత‌ల అక్ర‌మాలు బ‌య‌టికి రాకుండా ఇలా చేస్తున్నాడ‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అందుకే అంటారు.. తాను చేస్తే సంసారం మ‌రోక‌రు చేస్తే వ్య‌భిచారం అన్న‌ట్లుగా ఉంది చంద్రాలు  వ్య‌వ‌హారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: