అందరి పెళ్లికొడుకుల్లా తాళి కడతాడు ఈ నిత్యపెళ్లి కొడుకు కాని పెళ్లిచేసుకున్న తర్వాత సుఖాన్నిస్తాడు అనుకుంటున్నారా, కాదు సుఖంతో పాటు కట్టుకున్న దానికి చుక్కలు చూపిస్తాడు.భార్యను చిత్రహింసలు పెట్టడం అతడి దినచర్య.చివరకు వాళ్లు అతడి హింసను తట్టుకోలేక వెళ్లిపోగానే.మరోపెళ్లి చేసుకుంటాడు. అలా రెండుపెళ్లిల్లు విజయ వంతంగానే చేసుకున్నాడు. అయితే,మూడో ప్రయత్నం వికటించింది.మూడో వికెట్ పడగొడదాం అనుకునే లోపే ఈ సమాచారం ఇద్దరు భార్యలకు తెలిసిందట,ఇంకేం వుంది వారికి పూనకం వచ్చింది.అతని వీపుకు వాపచ్చేలా చితక బాదారు.



అతని పేరు ఎస్.అరవింద్.అలియాస్ దినేష్ వుండేది కొయంబత్తూర్.ఇతను 2016లో ప్రియదర్శి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు.కొద్ది రోజుల్లోనే ఆమెను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు.దీంతో ఆమె 2019లో అతడిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది.కొద్ది రోజుల తర్వాత అతడు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా మరో యువతి కోసం వెతకగా,అతనికి అనుప్రియా అనే మహిళ దొరకగా,విడాకులు తీసుకుని,రెండేళ్ల కొడుకుతో వున్న ఆమెని మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.కొన్నిరోజుల తర్వాత,ఆమెను కూడా దినేష్ అదేవిధంగా హింసించడం మొదలుపెట్టాడు.దీంతో ఆమెకూడా అతడిని వదిలిపెట్టి కరూర్‌లోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది.ఆ ఇద్దరికి విడాకులు ఇవ్వకుండానే దినేష్ మూడో సంబంధాన్ని వెతుక్కున్నాడు.



అది ఖాయం అవ్వడంతో పెళ్లి చేసుకోడానికి సిద్ధమయ్యాడు.ఎలాగోలా ఈ సమాచారాన్ని తెలుసుకున్న దినేష్ భార్యలిద్దరూ ఒక్కటయ్యారు.తమ బంధువులతో కలిసి దినేష్ పనిచేస్తున్న ప్రైవేట్ సంస్థ దగ్గరకు వచ్చి,అతడిని బయటకు పంపాలని ఆఫీస్ సిబ్బందికి చెప్పారు.అయితే,వాళ్లు దినేష్‌ను బయటకు పంపలేదు.దీంతో ప్రియదర్శిని, అనుప్రియా ఆఫీసు గేటు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.ఈ సమాచారం తెలియగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని,వారి సమస్య అడిగి తెలుసు కున్నారు దీంతో పోలీసులు ఆఫీసులో ఉన్న దినేష్‌ను బయటకు తీసుకొచ్చిన తర్వాత పోలీసుల వాహనం ఎక్కేందుకు వెళ్తుండగా ఇద్దరు భార్యలు,వారి బంధువులు దినేష్‌ను చుట్టుముట్టి చితక బాదారు.పోలీసులు అడ్డు పడడంతో బ్రతికాడు,ఇక దినేష్ ను అరెస్ట్ చేసి,అతని మీద చీటింగ్ కేసు నమోదుచేసారు..

మరింత సమాచారం తెలుసుకోండి: