రోజూ మన దేశంలో జరుగుతున్న అత్యాచారాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రతిరోజు ఒకదాన్ని మించి మరొకటి వస్తున్నాయే తప్ప ఏ ఒక్క చోటా మానవ రూపంలో తిరిగే క్రూరమృగాలు శాంతించినట్లు కనిపించడం లేదు. ఇప్పుడు జరిగిన ఈ భయానక దుర్ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. గుడికి అని తన ఇద్దరు స్నేహితులతో పాటు వెళ్తున్న ఒక 15ఏళ్ల అమ్మాయిని ముగ్గురు మానవ మృగాలు ఎత్తుకెళ్లి మానభంగం చేశారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం రాజస్థాన్ రాజధాని అయిన జైపూర్ నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న భిల్వారా జిల్లాలో జరిగింది.

గుడికి వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు తాగేసి ఉండి రేప్ కి గురి అయిన అమ్మాయి మరియు తన ఫ్రెండ్స్ వెంట పడ్డారు. తనతోపాటు ఉన్న ఇద్దరు స్నేహితులు ఎలాగోలాగా తప్పించుకోగా... పాపం! ఆ అమ్మాయి మాత్రం వారి కామ కత్తికి బలయింది. తప్పించుకున్న ఇద్దరిలో ఒక అబ్బాయి వెంటనే భయంగా పరిగెత్తుకుంటూ దగ్గరలోని ఒక దుకాణదారుడుకి ముగ్గురు వ్యక్తులు తనను కొట్టి తన బండి లాక్కెళ్లి తనతోపాటు ఉన్న మైనర్ అమ్మాయిని ఎత్తుకెళ్లి రేప్ చేస్తున్నారని జరిగిందంతా చెప్పాడు. వెంటనే దుకాణదారుడు ఆ చోటికి వెళ్లగా ఆ ముగ్గురు అమ్మాయిని చిత్రహింసలు పెడుతూ కొడుతున్నారు. వాళ్లను చూసి ఆ ముగ్గురు పరారి కాగా ఆ అమ్మాయి కూడా ఆ దుకాణదారుని చూసి భయపడుతూ అరకిలోమీటరు దూరం రోడ్డుపై నగ్నంగా పరిగెత్తింది.

దుకాణదారుడు ఎంత సర్దిచెబుతున్నా భయంతో పరుగులు తీసిన ఆమె చివరికి అతని మాటలు నమ్మ గా అతను తన దుస్తులు ఆమెకు ఇచ్చి ముందు హాస్పిటల్ కి వెళ్దామని అన్నాడు. కానీ తను మాత్రం తన మొదటి ఇంటికి వెళ్తానని తన తండ్రికి బాగాలేదని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. పరారీలో ఉన్న నిందితుల్లో ఇద్దరి పేర్లు రాజు కహర్ మరియు కైలాష్ కహర్. వారు వయస్సు 25 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇంకొక వ్యక్తి నారాయణ్ గుర్జార్. అతని వయస్సు 40 ఏళ్లు. ఇటువంటి అఘాయిత్యాలను ఆపేందుకు ఎన్ని చట్టాలు వచ్చినా ఇప్పటికీ ఈ దేశం మారలేదు. రోజుకు ఒక్కసారి అయినా ఇలాంటివి చూస్తుంటే మెల్లగా మారుతుందన్న ఆశ కూడా పోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: