చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నోరు తెరిస్తే చాలు .. పులివెందుల రాజకీయం, పులివెందుల రౌడీయిజమంటూ ఒక ప్రాంతాన్ని ఆ ప్రాంత ప్రజలను అవమానించి మాట్లాడేవారు. అయితే చివరికి ఏమైందో మనమందరం చూశాము. ఎన్నికలో చంద్రబాబు ఘోర ఓటమి. అయితే ఇప్పడూ ఛలో ఆత్మకూరు అంటూ బాబు గారు చేస్తున్నది ఏంది ? ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే బాబుగారి ఉద్దేశం ఉన్నట్టు ఉంది. పోలీసులు వచ్చి బాధితులను తమ స్వంత గ్రామాలకు తరలించారు. ఇంతటితో ఇక్కడ సమస్య ముగిసిపోయింది. కానీ బాబు ఇంకా రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారితప్పితే అప్పుడు చంద్రబాబుకు హ్యాపీగా ఉంటుందేమో అని చెప్పాలి.


చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జగన్ గాని పవన్ కళ్యాణ్ గాని ఉద్యమాలు చేస్తే వీరు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారని బాబు గారు చాలా ఆవేదన చెందారు. కానీ ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది ఏందీ ? కార్యకర్తల మీద దౌర్జన్యాలు అంటూ .. రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నారు. అమరావతి తరలిపోతుందని .. ఉన్నది లేనిది చెబుతూ రాష్ట్రంలో గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మరీ చంద్రబాబు చర్యల వల్ల ఇప్పుడు పెట్టుబడులు ఆగిపోవా ? అంటే చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నది కేవలం తన రాజకీయ లబ్ది కోసమేనని అర్ధం చేసుకోవాలి. పైకి మాత్రం ప్రజలు అంటూ బిల్డప్ ఇస్తున్నారు. 


రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఇలానే .. టీడీపీ కార్యకర్తల మీద దాడులు పెరిగిపోతున్నాయని పబ్లిసిటీ రాజకీయాలు చేశారు. కానీ అప్పుడు జనాలు పెద్దగా పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే మళ్ళీషురూ చేశారు. కామెడీ ఏంటంటే ఇప్పుడు కూడా జనాలు పెద్దగా సీరియస్ గా తీసుకోవటం లేదు. కానీ బాబు మాత్రం .. పొలిటిల్ మైలేజ్ కోసం తెగ పాకులాడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: