ఒక దేశం అభివృద్ధిపధంలో ఉండాలంటే పొరుగు దేశాలు కూడా మంచివి అయి ఉండాలి. మన ఖర్మ ఏంటంటే మన పక్కన పాకిస్థాన్ ఉండటం .. దేశంలో ఉగ్రదాడులు జరిపి దేశాన్ని అస్థిర పరచాలని చాలా సార్లు ఉగ్రమూఖలను భారత గడ్డ మీదకు పంపించింది. అయితే ఇప్పుడు కాశ్మీర్ విషయంలో మరో దేశంలో మారణ హోమం జరపాలని పాక్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. పాక్ ఆర్మీ ఉగ్రవాదులతో కలిసి దాడులు జరపాలని భావిస్తునట్టు భారత్ ఇంటెలిజెంట్ వర్గాలు పేర్కొంటున్నాయి. రేడియో సిగ్నల్ ద్వారా పాక్ ఆర్మీ కాశ్మీర్ లో ఉన్న కొంత మందితో మాట్లాడ్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సారి పాక్ ఎటువంటి విధ్వంసానికి పాల్పడిన భారత్ పీఓకే లోకి దూసుకుపోవటం ఖాయంగా కనిపిస్తుంది. 

కాశ్మీర్ విషయాన్ని ఐక్యరాజ్య సమితిలో జరిగిన సమావేశంలో పాక్ లేవనెత్తడంతో భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాశ్మీరు మా అంతర్గత వ్యవహారం. ఎవరైనా జోక్యం చేసుకుంటే సహించమని గట్టి హెచ్చరిక చేసింది. ఇప్పటికే పలు దేశాలు కాశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పిన సంగతీ తెలిసిందే. అయితే మొన్నటి వరకు కాశ్మీర్ విషయంలో ఒక విధంగా స్పందించిన పాక్ ఇప్పుడు ఏకంగా ఐక్యరాజ్య సమితి సమావేశంలో కాశ్మీర్ భారత్ లో ఒక రాష్ట్రమని చెప్పడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇలా పాక్  రోజుకొక స్టేట్మెంట్ ఇస్తూ ఆ దేశపు డొల్లతనాన్ని బయట పెట్టుకుంటుంది.


అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద ఎక్కడ భారత్ కన్ను పడుతుందోనని పాక్ వ్యూహాత్మకంగా ఇటువంటి వ్యాఖ్యలు చేసిందా అని సందేహం వస్తుంది. భారత్ తో యుద్ధం చేసి ఓడించే శక్తి పాక్ కు లేదని దానికి తెలుసు. రెండు రోజుల నుంచి పాక్ ఆర్మీ చీఫ్ .. ఇమ్రాన్ ఖాన్ యుద్ధం తప్పదంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. భారత్ ఎక్కడ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఆక్రమించుకుంటుందోనని పాక్ లో ఆ ఆందోళన క్లియర్ గా కనిపిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: