నాయకులూ ప్రసంగిస్తున్నప్పుడు  అప్పుడప్పుడు తప్పులు దొర్లడం జరుగుతూ ఉంటుంది . అయితే అలా తప్పులు దొర్లినపుడు దాన్ని  కవర్ చేసే ప్రయత్నం చేస్తారు . కొంత మంది కవర్ చేయటంలో సక్సెస్ అయితే కొంత మంది నెటిజన్లకు దొరికిపోతారు . ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి .ఇలాంటి సంఘటనే ఎదురైంది కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ కి .


కేంద్ర రైల్వే షాక్ మంత్రి పియూష్ గోయల్ విలేకర్ల తో మాట్లాడుతున్న సందర్బంగా ...ఓ విలేకరి అడిగిన ప్రశ్నకి అయన చెప్పిన సమాధానం నెటిజన్లు కామెంట్ చేసేలా చేసింది .ఇంతకీ ఎం జరిగిందంటే  ఆయన ప్రెస్ కాన్ఫిరెన్స్ లో మాట్లాడుతున్న సందర్బంగా ఆర్ధిక మాంద్యం గురుంచి ఓ విలేకరి మంత్రిని ప్రశ్నించగా ...ఇప్పుడు లెక్కల గురుంచి ఎందుకులెండి వాటి గురుంచి మర్చిపోండి ...లెక్కల వల్ల ఐన్‌స్టీన్ గ్రావిటీ గుర్తించలేదు అని సమాధానం ఇచ్చారు .ఈ సమాధానం తో మంత్రి పప్పులో కాలేసినట్టయ్యింది .


ఎందుకంటే గ్రావిటీ కనిపెట్టింది ఐన్‌స్టీన్ కాదు న్యూటన్ కాబట్టి ...ఒక చెట్టు నుండి ఆపిల్ కిందపడటం చుసిన న్యూటన్ ...భూమ్యాకర్షన శక్తి గురుంచి కనిపెట్టిన విషయం అందరికి తెలిసందే . కానీ ఒక కేంద్ర మంత్రి స్థానంలో ఉండి ఇలా  మాట్లాడటం తో ...నెటిజన్లు మంత్రి పై ట్రోల్స్ చేస్తున్నారు . కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న మీకు ఈ చిన్న విషయం తెలియదా అంటూ కామెంట్లు చేస్తున్నారు . ఏది ఏమైనా... మంత్రి గారికి ఇప్పుడైనా తెలిసినదో లేదో మరి ... గ్రావిటీ ని కనిపెట్టింది న్యూటన్ అని . అయితే నాయకులూ మాట్లాడుతున్నప్పుడు అపుడప్పుడు ఇలాంటివి కామనే అనుకోండి ...కాని నెటిజన్లకు ఇలాంటివి దొరికితే మాత్రం ట్రోల్స్ తప్పవు కదా 


మరింత సమాచారం తెలుసుకోండి: