వివాహేతర సంబంధాలు ఎంతటి నేరాలకైనా ఉసిగొల్పుతాయి. వీటికి పెద్దగా వయస్సుతోనూ సంబంధం ఉండదు.. ఉండేదల్లా వ్యామోహమా.. ఆకర్షణే..ఆ వ్యామోహం మత్తులో ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కూడా ఉండదు.. అలాంటి ఘటనే తాజాగా గుంటూరు జిల్లాలో జరిగింది.


భర్తను భార్యే హతమార్చిన ఉదంతం గురువారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం పట్లవీడుకు చెందిన దొడ్డక ఆంజనేయులు , ఆది లక్ష్మి దంపతులు గొర్రెలు కాసుకుని జీవనం సాగిస్తుంటారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.. పెళ్ల చాలా ఏళ్లవుతోంది. ఈ మధ్య ఆదిలక్ష్మికి భర్తతో గొడవలు వస్తున్నాయి. ఇక నీతో వేగలేనంటూ ఆమె తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని మాచర్ల వెళ్లి అక్కడే నివాసం ఉంటోంది.


క్రమంగా భర్తలో సంబంధాలు తగ్గిపోయాయి.. అయితే భర్తకు దూరంగా ఉంటున్న ఆదిలక్ష్మి మాచర్లలో మరో వ్యక్తికి దగ్గరైందని తెలుస్తోంది. ప్రియుడిపై మోజుతో ఆమె భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించింది. ఇటీవల ఆంజనేయులు మాచర్లలో ఉంటున్న భార్య ఆది లక్షి వద్దకు వచ్చాడు.. ఆ తర్వాత అతను కనిపించకుండా పోయాడు. వెల్దుర్తిలోని ఆంజనేయులు తమ్ముడు అప్పారావు అన్న అదృశ్యంతో కలత చెందాడు.


విషయం కనుక్కుదామని మాచర్లలోని వదిన వద్దకు వెళ్లి అన్న గురించి అడిగాడు.. మొదట తనకేమీ తెలియదని ఇక్కడకు రాలేదని ఆదిలక్ష్మి బుకాయించింది. కానీ వదిన వాలకంపై అనుమానం వచ్చిన అప్పారావు మరింత గట్టిగా నిలదీశాడు.. విషయం చెప్పకపోతే.. పోలీసులకు పట్టిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆదిలక్ష్మి అసలు గుట్టు విప్పేసింది.


భర్త ఆంజనేయులును తానే చంపానని ఆదిలక్ష్మి ఒప్పేసుకుంది. ఇంతకీ భర్త శవాన్ని ఎక్కడ దాచి పెట్టిందో తెలుసా.. మాచర్ల శివార్లలోని డంపింగ్ యార్డులో గొయ్యి తవ్వి శవాన్ని చెత్తతో పూడ్చేసింది. దీంతో అప్పారావు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి ఆదిలక్ష్మిని తీసుకెళ్లి డంపింగ్ యార్డులో వెదికితే.. ఆంజనేయులు డెడ్ బాడీ కనిపించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: