ఆడపిల్ల అంటేనే గుండెల్లో రైళ్లు పరుగెడుతున్న రోజులు,అలాంటిది పెళ్లి వయస్సు వచ్చాక ఆగుతామా తొందరగా ఆ బాధ్యత కూడా తీర్చుకుంటే సరిపోద్దని ఆలోచించుతారు. ఇక ఓ అబ్బాయిని చూసి పెళ్లి చేస్తే వాడితో పాటు వారి ఇంట్లో వాళ్లు కూడా మంచివారైతేనే ఆ పిల్ల సంతోషంగా ఉండగలుగుతుంది.లేదంటే ఇదిగో ఇప్పుడు చదవబోయే మ్యాటర్లోని కష్టాలు భరిస్తుంది. ఎవరైతే నాకేంటి తప్పుచేసిన వాళ్లని బజారుకు ఈడ్చాలని భావిస్తే ఆమ్మాయి సేఫ్,పరువుకోసం ఆలోచిస్తే ఆమె జీవితం ఆకు మీది బొక్కలా మారుతుంది.ఇక ఇక్కడ ఓ అమ్మాయి తన పై కన్నేసిన,కీచకులైన,మామ,మరుదులను జైలు పాలు చేసింది.ఆ వివరాలేంటో చూద్దాం పదండి..



ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ ప్రాంతానికి చెందిన యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ఇటీవల ఘనంగా వివాహం చేసారట.ఎన్నో కొత్త ఆశలతో అత్తారింటికి అడుగుపెట్టిన ఆమెపై కన్నేసిన మామగారు తన గదిలోకి వచ్చి బాడీమసాజ్ చేయాలని ఆదేశించారట.తనకు మసాజ్ చేయడం రాదని,తాను అలాంటిదిదాన్ని,కాదని సున్నితంగా తిరస్కరించిందట.ఇక ఈ విషయాన్ని భర్తకు చెప్పగా,అతడు తన తండ్రి అడిగిన దాంట్లో తప్పేముందని నువ్వు మసాజ్ చేయాల్సిందేనని ఆదేశించాడట.దీంతో ఆ అమ్మాయి చేసేదేమీ లేక మామగారి గదికి ఒంటరిగా వెళ్లి మసాజ్ చేస్తున్న సమయంలో కామంతో రగులుతున్న ఆ మగ మృగం అసభ్యంగా మాట్లాడుతూ,చేయకూడని పనులు చేస్తూ హద్దుమీరి ప్రవర్తించినా,సహనంగా భరించి పని పూర్తిచేసింది.ఇదే తంతూ ఆ మరుసటి రోజుకూడా జరిగిందట.



తనతో పాటు తన చిన్న కుమారులిద్దరికీ మసాజ్ చేయాలని మామ ఆదేశించగా ఆ మహిళ షాకైంది.దీంతో పాటు మరుదులు ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించారు.ఈ విషయాన్ని దాచిపెడితే తాను వారి చేతిలో నలిగిపోవాల్సిందేనని భావించిన బాధితురాలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.దీంతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు.ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లో మహిళలపై లైంగిక దాడులకు అంతే లేకుండా పోతోంది.బయటికి వెళ్ళితే లైంగిక వేధింపులున్నాయంటే ఇంట్లోనూ వారికి వేధింపులు తప్పడం లేదు.కొత్త పాత అని చూడకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు..ఇప్పుడే సమాజం ఇలావుంటే ముందుముందు పరిస్దితులు ఎలావుంటాయోనని ప్రజలు భయపడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: