చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో ఇపుడు అర్ధమవుతోంది. జగన్ చెప్పిన మాట తప్పకుండానే టీడీపీ కోటలను ఒక్కొక్కటిగా కూల్చేస్తున్నారు. చంద్రబాబు నలభయ్యేళ్ళ రాజకీయం జగన్ పదేళ్ళ అనుభవం ముందు ఎక్కడా ఢీ కొట్టలేకపోతోంది. చేతిలో అధికారం ఉంది, ముందు చూపుతో పోతున్న జగన్ కి అన్ని రకాలుగా ఏపీ రాజకీయం కలసివస్తోంది. దీంతో జగన్ దూకుడుకు టీడీపీ దుకాణం బంద్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.


ఈ రోజు గోదావరి జిల్లాలో సీనియర్ మోస్ట్ నేత, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైసీపీలో చేరిపోయారు. ఆయన ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ చూస్తే టీడీపీకి మూడినట్లేనని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఇక లేదన్న తీరులో తోట హాట్ కామెంట్స్ చేసారు. ప్రతిపక్షంగా టీడీపీ సత్తా చాటలేదని, ఇక్కడ  ఉన్నది జగన్ కూడా చెప్పేశారు. అంతే కాదు, జగన్ని ఏపీలో సమగ్ర  అభివ్రుధ్ధి చేస్తారని  ప్రజలు ఎన్నుకున్నారని గుర్తుచేసారు.



బాబు నాయకత్వంలో టీడీపీ దివాళా తీసిందన్న తోట ఇక టీడీపీ నుంచి ఎంతో మంది వస్తారని చెప్పడం విశేషం. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో సీనియర్ నేత ఆమంచి క్రిష్ణ‌ మోహన్ మాట్లాడుతూ, జగన్ పిలుపు ఇస్తే చాలు టీడీపీ కంచుకోటలు మంచు కోటలు అయిపోతాయని హడలెత్తించే స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఏపీలో టీడీపీ పని అయిపోయిందని కూడా ఆమంచి అన్నారు. ఒక్క మూడు నెలలు ఆగితే చాలు టీడీపీలో ఎవరూ మిగలరు అని కూడా ఆమంచి బాంబు ల్లాంటి మాటలు వదులుతూంటే పసుపు శిబిరం వణికిపోకుండా ఉండగలదా.


ఇక ఇదే మీడియా సమావేశంలో వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, టీడీపీ పతనం ఎన్నికల ఫలితాలతోనే మొదలైందని అన్నారు. ఆ పార్టీలో ఇక ఎవరూ కొనసాగే అవకాశాలే లేవని క్లారిటీగా చెప్పేశారు. మరి చూడబోతూంటే తోట త్రిమూర్తులు బోణీ కొట్టాడన్న మాట. మరెంతమంది తమ్ముళ్లు జంప్ చేస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: