ప్రజలు తమని కాపాడుతారని ఎన్నుకున్న నేతలే ఇప్పుడు వారి పాలిట నరరూప రాక్షసులవుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో 'లా' చదువుతున్న ఒక విద్యార్థినిపై బిజెపి నేత చిన్మయానంద్ ఘోర అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు చెప్పిన దాని ప్రకారం మాజీ యూనియన్ మినిస్టర్ మరియు బిజెపి నేత అయిన చిన్మయానంద్ తనను నడుపుతున్న ఒక 'లా' కాలేజి లోని విద్యార్థిని స్నానం చేస్తుంటే అతని నమ్మకస్థుడైన ఒకడితో వీడియో తీయించి ఆ తరువాత దానితో ఆమెను బ్లాక్ మెయిల్ చేసి రేప్ చేశాడట. ఇలా బెదిరిస్తూనే ఆమెకు ఒక సంవత్సరం రోజులు నరకయాతన చూపించాడని తను చెప్పుకొచ్చింది.

ఇందుకు సంబంధించి ఆ అమ్మాయి 'సిట్' విభాగానికి 43 వీడియో క్లిప్పులను ఇచ్చింది. అయితే ఇక్కడ ఇంకొక ఆశ్చర్యమేమిటంటే తనకు ఇలా జరుగుతుందని కాలేజీ మొత్తానికి తెలుసుని చెప్పి ఆమె తీవ్రంగా వాపోయింది. ఈ విషయాన్ని ఏ ఒక్కరూ ఖండించక పోగా చివరికి తనతో మాట్లాడటానికి కూడా ఎవరూ ధైర్యం చేయలేదట. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ 23 ఏళ్ల బాధితురాలు బయటకు ఏమీ చెప్పలేక సంవత్సరం రోజులు అలాగే ఉండిపోయిందట. 

ఆమె ఇచ్చిన వీడియో క్లిప్స్ ను ఫోరెన్సిక్ టీం పరిశీలించగా ఈ నెల 23వ తేదీన ప్రతి ఒక్కరూ మానిటరింగ్ బెంచ్ ముందు హాజరు కావాల్సిందిగా ఉత్తర ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమిటంటే అప్పటి వరకు 'సిట్' విభాగంపై నమ్మకం ఉంచిన బాధితురాలి కుటుంబం ఇప్పుడు వారి మాటను మార్చుకున్నారు. ఒక మీడియా సంస్థకు బాధితురాలి కుటుంబం తెలియజేసింది ఏమిటంటే సిట్ వారి పైన మీద నమ్మకంతో తాము చిన్మయామంద్ కి వ్యతిరేకంగా ఇచ్చిన సాక్ష్యాలు టాంపరింగ్ కి గురి అయ్యాయని లేదా నాశనం చేశారని వారు ఆరోపిస్తున్నారు.

ప్రముఖ మీడియా సంస్థ ఈ విషయమై డీజీపీతో మాట్లాడదామని ప్రయత్నించినా వారు తమకు ఏమీ సంబంధం లేదని... అలహాబాద్ హైకోర్టు బెంచ్ ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్టు ఎద్దేవా వేస్తున్నారట. కాబట్టి కచ్చితంగా ఈ కేసు పక్కదారి పట్టే అవకాశాలు చాలానే ఉన్నాయని చెప్పాలి. ఏమైనా ఆ బాధితురాలికి చివరికి న్యాయం జరిగి చిన్మయానంద్ కు కఠినమైన శిక్ష పడడం అన్నది ఇక కోర్టు వారి చేతుల్లోనే ఉంది అని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: