కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, కేంద్రంలో ఆర్థిక, హోం శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తి. అయితేనెం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, ప్రస్తుతం న్యూ ఢిల్లీలోని తీహార్ జైల్లో కాలం గడుపుతున్నారు. ఆయనే పి చిదంబరం. నేడు ఆయన 74 వ పుట్టిన రోజు. ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యుల మధ్య, పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుయాయుల మధ్య వేడుకలు జరుపుకునే ఆయన, ఈ సంవత్సరం జైల్లోనే ఉండాల్సి వచ్చింది.


ఈ సందర్భంగా చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం, తండ్రికి ఒక మెసేజ్ పంపాడు. "56 అనే సంఖ్య ఆపలేదని  పేర్కొన్నారు. " మీ వయస్సు 74 సంవత్సరాలు. 56 మిమ్మల్ని ఆపలేదు. మీరు ఎన్నడూ పుట్టినరోజును గ్రాండ్ గా చేసుకోలేదు. మీరు లేకుండా మేము వేడుకలను జరుపుకోలేము. మీరు సాధ్యమైనంత త్వరగా వచ్చి మా కోసం  కేక్ ను కట్ చేయాలని కోరుకుంటున్నాం" అని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ సుధీర్ఘ లేఖను ఆయన రాశారు. మీరు చూపించిన స్పూర్తితో ముందుకు సాగుతామని తెలిపారు.


ఇక ఇదే లేఖలో చంద్రాయన్-2  గురించి కూడా కార్తి చిదంబరం ప్రస్తావించారు. ఈ కార్యక్రమాన్ని తాను లైవ్ చేశానని చెబుతూ, అక్కడ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని, ముఖ్యంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ ఏడుస్తున్నట్టు కనిపించారని, అపై ప్రధాని మోదీ, ఆయన్ను ఓదార్చారని గుర్తు చేసుకున్నారు. 


మోదీకి ఆయన భక్తులపైనే ప్రేమ ఎక్కువని ఎద్దేవా చేశారు. ఏవియేషన్ సాంకేతికను,  ప్లాస్టిక్ సర్జరీని భారత శాస్త్రవేత్తలు, వైద్యులు ఎన్నో సంవత్సరాల క్రితమే కొనుగొన్నారని, ఇస్రో కాదని అన్నారు. పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ ఇటీవల చేసిన వాహన అమ్మకాలపై వ్యాఖ్యలను, జమ్మూ-కాశ్మీర్ లో పరిస్థితులను కూడా కార్తీ తన లేఖలో పేర్కొనడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: