పాకిస్దాన్ అంటే ప్రతి భారతీయుడి రక్తంలో ఓ వైబ్రేషన్ మొదలవుతుంది.ఆ సమయంలో ప్రతి భారతీయుడి గుండే శబ్ధంలో ఫిరంగులమోత వినిపిస్తుంది. అవకాశం వస్తే ప్రతి భారతీయుడు భరతమాతకోసం ప్రాణాలను లెక్కచేయడని కొన్ని సందర్భాల్లో నిరూపించబడింది.ఇక ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా, ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో భారత వాయుసేన వైమానిక దాడులు చేసి, బాంబులతో జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది.భారత్ ఎయిర్ స్ట్రైక్స్ చేసినప్పటి నుండి ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.అవి ఎంతటి పరిణామానికి దారితీస్తాయే తెలియని సందిగ్ద పరిస్దితి ఇరు దేశాల మధ్య నెలకొంది.



ఈ సందర్భంలో భారత్ పాకిస్థాన్‌ గట్టిగా బుద్ది చెప్పడానికి,మరో ఎయిర్ స్ట్రైక్‌కు సిద్ధమవుతుందా?తరచూ పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలకు చెక్ పెట్టాలని చూస్తుందా?వచ్చే నెలలో యుద్ధం చేస్తామని పాక్ ప్రకటనతో ముందస్తు జాగ్రత్తలు పడుతుందా?ఒకవేళ యుద్ధం వస్తే పాక్‌కు గట్టి గుణపాఠం చెప్పేందుకు సన్నద్దమవుతుందా.?అంటే అవుననే చెబుతున్నారు.దానికి సంకేతంగా భారత ఆయుధ సంపత్తి పెంచుకొంటుందని అంటున్నారు.తాజాగా భారత అమ్ముల పొదిలోకి చేరిన బాంబులు చూసిన పాక్ ఏ మాత్రం తొకాడించినా..మరో ఎయిర్ స్ట్రైక్ చేసేందుకు భారత్ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోందట.. ఇప్పటికే పుల్వామా దాడిలో ఎవరు చనిపోలేదని,పాక్ వల్లిస్తుంటే కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా  దానికి వంతపాడాయి.అయితే తాజాగా జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తొలగిస్తూ ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే.దీంతో పాక్,భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్..భారత్ మరోసారి బాలాకోట్ లాంటి దాడులకు పాల్పడబోతుందంటూ వ్యాఖ్యలు చేశారు.ఆ వ్యాఖ్యల్ని చూస్తుంటే,బాలాకోట్ ఉగ్రస్థావరాలపై జరిగిన దాడుల్లో ఉగ్రవాదులు హతమయ్యారని స్పష్టంగా తెలుస్తుందట..



అయితే రెండో సారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ ఆయుధ సంపత్తిని వృద్ధి చేసే పనిలో భాగంగా,జూన్ మాసంలో ఇజ్రాయిల్‌తో పలు ఒప్పందాలు కుదుర్చుకుని,అత్యంత శక్తివంతమైన స్పైస్-2000 బాంబులను ఆర్డర్ చేశారట.మొత్తం వంద బాంబులను కొనుగోలు చేసేందుకు భారత వైమానిక దళం రూ.300కోట్లతో డీల్ కుదుర్చుకుందని,ఈ బాంబులు ప్రస్తుతం భారత్ చేరుకున్నాయని తెలుస్తుంది.ఇక ఒప్పందంలో భాగంగా మొదటి విడత స్పైస్- 2000 బాంబులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ లోని వైమానిక కేంద్రానికి వచ్చాయట.ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ నుంచి మరిన్ని బాంబులు రానున్నాయని,అయితే తాజాగా చేరిన స్పైస్-2000 మరింత శక్తికలిగి పెద్ద పెద్ద బిల్డింగ్‌లను సైతం సులభంగా నేలమట్టం చేయగలవని చెబుతున్నారు.



ఇప్పటికే భారత్ తో యుద్ధం చేస్తాం అంటూ కవ్వింపు చర్యలకు పాల్పుడుతన్న పాక్‌కు..స్పైస్-2000 ఆయుధాలు భారత్‌కు చేరాయన్న వార్త మింగుడుపడటం లేదు.అయితే ఈ బాంబులను ప్రయోగించే సామర్థ్యం ఉన్న మిరాజ్ -2000 యుద్ధ విమానాలు గ్వాలియర్‌లో వైమానిక స్థావరంలో ఉండటం మూలాన,ఈ స్పైస్ -2000 బాంబులను కూడా అక్కడికే తరలించారటఇక వచ్చే నెలలోనే భారత్ చేతికి రాఫేల్ యుద్ధ విమానాలు కూడా రాబోతున్నాయని సమాచారం. అయితే అవి పూర్తిగా మన దేశానికి చేరడానికి మరో ఆరు నెలలు పడుతుందట. కానీ యుద్ధం అనేదే వస్తే..తక్షణమే వాటిని రప్పించే అవకాశం కూడా లేకపోలేదు. ఏదేమైనా ప్రస్తుతం స్పైస్-2000 బాంబులు భారత్ అమ్ముల పొదిలోకి చేరడంతో పాక్‌కు భారీ షాక్ తగిలినట్లైందని తెలుస్తుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: