ఉద్యోగాలు లేని ఎందరో నిరుద్యోగులు ఆశను చంపుకోలేక,ఇకనైన అధికారులు తమపట్ల కరుణించి నోటిఫికేషన్స్ విడుదల చేస్తారని కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు.ఈ పరిస్దితుల్లో ఓవైపు ఆర్థిక మాంద్యం ఛాయలు.మరోవైపు నిరుద్యోగం నీడలు వెరసి ఉన్నత చదువులు చదువుకున్న వారిని తికమక పెడుతున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఉద్యోగాలపై నిరుద్యోగులకు దాదాపు ఆశలు సన్నగిల్లుతున్న తరుణంలో కోల్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులు త్వరలో శుభవార్త అందించనుందని సమీప భవిష్యత్తులో కోల్ ఇండియా లిమిటెడ్ 9000 ఎగ్జిక్యూటివ్,నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనుందని ఎనామిక్ టైమ్స్ తెలిపింది.



పోటీపరీక్షలు,ఇంటర్వ్యూలు,అంతర్గత నియామకాల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేపట్టనున్నట్లు పేర్కొంది.గడచిన దశాబ్దకాలంలో ఇదే అతిపెద్ద రిక్రూట్‌ మెంట్ డ్రైవ్ అని..చాలావరకు ఖాళీలు పెండింగ్‌లో ఉండటంతో,వాటిని ఈ ఒక్క ఏడాదిలో భర్తీ చేస్తామని,కోల్ ఇండియా పరిధిలోని 8 సబ్సిడరీ కంపెనీలలో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు కోల్ ఇండియాకు చెందిన ఉన్నతాధికారి వెల్లడించినట్టు తన కథనంలో పేర్కొంది.ఇక కోల్ ఇండియా గతేడాది 1200 ఉద్యోగ నియామాకాలు చేపట్టగా..ఈ ఏడాది 9 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టడం లక్ష్యంగా పెట్టుకుంది.వీటిలో 4000 ఖాళీలు ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు ఉన్నాయి. వీటిలో 900 పోస్టులను ప్రకటనలు,ఇంటర్వూ ద్వారా,2200 పోస్టులను పోటీ పరీక్షల ద్వారా,400 పోస్టులను క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా,మిగతా పోస్టులను వేర్వేరు విధానాల్లో భర్తీ చేయనున్నారట.



ఇక ఇండియన్ రైల్వేల తర్వాత ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్న పబ్లిక్ సెక్టర్ సంస్థగా'కోల్ ఇండియా'పేరుగాంచిందని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.మొత్తం కోల్ ఇండియాలో 2,80,00 మంది ఉద్యోగలు పనిచేస్తుండగా.వీరిలో 18,000 మంది ఎగ్జిక్యూటివ్ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారట.ఇక నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల విషయానికొస్తే.వీటిలో ప్రధానంగా కార్మికులు,టెక్నికల్ పోస్టులు కలిపి మొత్తం 5000 ఖాళీలను సంస్థ నిబంధనల ప్రకారం భర్తీ చేయనున్నారు. వీటిలో 2300 పోస్టులను కోల్ ఇండియా ప్రాజెక్టుల కారణంగా భూమిని కోల్పోయిన నిర్వాసిత కుటుంబాల్లోని వ్యక్తులతో భర్తీ చేయగా మిగిలిన 2350 పోస్టులను కారుణ్య నియామకాలు చేపట్టనున్నారని అధికారులు తెలిపారట.

మరింత సమాచారం తెలుసుకోండి: