ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితి రోజుకో మలుపు తిరుగుతుంది. చంద్రబాబు నాయుడు తనకు కావాల్సింది చేసుకోడానికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ మాజీ అసెంబ్లీ స్పీకర్, తెలుగు దేశం పార్టీ కీలక నేత కోడెల శివ ప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం తెలిసిందే.     


మృతి చందిన సమయం నుండి చంద్రబాబు అక్కడే ఉండి శవరాజకీయం చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం వల్లే కోడెల శివ ప్రసాద్ చనిపోయారని టీడీపీ నేతలు, అధినేత చంద్రబాబు, అతని సుపుత్రుడు నారా లోకేష్ భారీగా ఆరోపిస్తే ఆ ఆరోపణలను త్రిగి వాళ్ళకే తగిలేలా తిప్పికొడుతున్నారు వైసీపీ నేతలు.    


చంద్రబాబు నాయుడు కోడెలను దూరం పెట్టడం వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. అయితే జగన్ ప్రభుత్వానికి షాక్ తగిలేలా కోడెల శివ ప్రసాద్ రావు కుమార్తె విజయలక్ష్మి సంచలన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే మొదటి నుండి తెలుగు దేశం పార్టీ ఆరోపించినట్టే అదే నమ్ముతూ రాజకీయ వేధింపులు తన తండ్రి మరణానికి కారణమని భావించి తన తండ్రి జగన్ ప్రభుత్వం వల్లే చనిపోయారని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం.    


రాజకీయ కక్ష సాధింపు కోసమే తన తండ్రి మరియు సోదరులపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేసారని అందువల్లే తన తండ్రి చనిపోయారని ఆ ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారట. అయితే ఈ విషయంపై వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చేసింది. మా ప్రభుత్వం కానీ మా నేతలు కానీ ఎవరు కేసు పెట్టలేదని ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. అయినప్పటికీ ఆమె కాసు పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది.     


మరింత సమాచారం తెలుసుకోండి: